IPL 2021: మహి-విరాట్‌ ఆఖరిగా!

మహేంద్రసింగ్‌ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.. ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌లోనూ అతడు కొనసాగేది అనుమానంగానే ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి

Updated : 25 Sep 2021 06:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేంద్రసింగ్‌ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.. ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌లోనూ అతడు కొనసాగేది అనుమానంగానే ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో సారథ్యం వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విరాట్‌ కోహ్లికి రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా కూడా ఇదే చివరి సీజన్‌. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా దాదాపు చివరిసారి ధోని-కోహ్లి కలిశారు. శుక్రవారం ఐపీఎల్‌లో చెన్నై-బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా వీరిద్దరూ టాస్‌ సందర్భంగా ఎదురుపడడం ఆసక్తిని రేపింది. ఈ సీజన్లో చెన్నైతో బెంగళూరు ఇప్పటికే రెండుసార్లు తలపడిన నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే తప్ప మళ్లీ ధోనితో కోహ్లి టాస్‌కు వెళ్లే దృశ్యాన్ని చూసే అవకాశం అభిమానులకు ఇక లేనట్లే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని