IPL 2021 CHAMPION: గర్జించిన చెన్నై సింహాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ఛాంపియన్గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై సీఎస్కే 40 పరుగుల తేడాతో ఘన...
గతేడాది ఘోర పరాభవం...
జట్టులో లుకలుకలు వచ్చాయని రూమర్లు..
సారథిగా ఇక ధోనీ మాయ ముగిసిందనే మాటలు..
వీటన్నింటినీ దాటుకుని ఐపీఎల్ 14వ సీజన్ ఛాంపియన్గా అవతరించింది చెన్నై సూపర్ కింగ్స్..
మరోవైపు లీగ్ దశ ఆరంభంలో ఆపసోపాలు.. సెకండ్ ఫేజ్కు వచ్చేసరికి దిమ్మదిరిగే విజయాలతో ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్టు కోల్కతా నైట్రైడర్స్.. అదే ఊపులో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న దిల్లీ, బెంగళూరు జట్లను ఓడించి మరీ ఫైనల్కు దూసుకొచ్చింది.. అయితే సీఎస్కే ముందు కేకేఆర్ తలవంచక తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు ఫేజుల్లో జరిగిన ఐపీఎల్ 2021వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. కీలకమైన తుదిపోరులో కేకేఆర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సీఎస్కే చేతిలో పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో మంచి ఆరంభం ఇచ్చినా ఫలితం దక్కలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్పై సీఎస్కే 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగో ఐపీఎల్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను డుప్లెసిస్ అందుకున్నాడు. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (635) టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్గానూ రుతురాజ్ ఎంపికయ్యాడు. గైక్వాడ్ తర్వాత ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసింది డుప్లెసిస్ (633) కావడం విశేషం. అత్యధిక వికెట్లను పడగొట్టే వారికి ఇచ్చే పర్పల్ క్యాప్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ (32) అందుకున్నాడు.
ఛేదనలో ఓపెనర్లు అదుర్స్.. కానీ
193 పరుగుల భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా కోల్కతా అదరలేదు. దానికి కారణం మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్లు శుభ్మన్ గిల్ (51: 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (50: 5 ఫోర్లు, 3 సిక్సర్లు). వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం అందించి గట్టి పునాది వేశారు. అయితే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తి కాగానే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా (0), సునీల్ నరైన్ (2), ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తిక్ (9), షకిబ్ (0), త్రిపాఠి (2) తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో 91/1 నుంచి 125/8కి పడిపోయింది. 34 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కోల్పోవడం కేకేఆర్ పతనానికి దారితీసింది. చివర్లో శివమ్ మావి (20) బ్యాట్ను ఝళిపించినా అప్పటికే ఆలస్యమైంది. ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే దోహదపడింది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హేజిల్వుడ్ 2, రవీంద్ర జడేజా 2.. చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు.
ఉతికేసిన చెన్నై బ్యాటర్లు ..
మంచి ఫామ్లో ఉన్న చెన్నై ఓపెనర్ల ద్వయం రుతురాజ్ గైక్వాడ్ (32: 3 ఫోర్లు, ఒక సిక్సర్), డుప్లెసిస్ (86: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు అర్ధశతకం (61 పరుగులు) భాగస్వామ్యం నిర్మించారు. రుతురాజ్ ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన ఉతప్ప (31: 3 సిక్సర్లు), మొయిన్ అలీ (37*: 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి డుప్లెసిస్ కేకేఆర్ బౌలింగ్ను ఓ ఆటాడునుకున్నాడు. కోల్కతా బౌలర్లలో నరైన్ 2, మావి ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు