రికార్డు ‘8’పై పేస్ గురి
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు...
కోల్కతా: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘2020 ఒలింపిక్స్లో చివరి గర్జన’ అంటూ 2019 క్రిస్ట్మస్ రోజున పేస్ పేర్కొన్నాడు. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ‘‘ఇంతపెద్ద కరోనా మహమ్మారి చుట్టుముడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేసింది. కానీ సుదీర్ఘ విరామం తర్వాత చాలా సంతోషంగా ఉంది. శారీరకంగా, మానసికంగా పూర్తి సన్నద్ధంగా ఉన్నా. చరిత్ర పుస్తకాల్లో భారత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే నాకు ముఖ్యం. అందుకే 30 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పటికే ఏడు ఒలింపిక్స్లలో పాల్గొన్న రికార్డు నాకుంది. ఎనిమిదో ఒలింపిక్స్లోనూ పాల్గొనగలను. టెన్నిస్లో అత్యధిక ఒలింపిక్స్లు ఆడిన రికార్డు భారత్ పేరిట నిలిచిపోతుంది. టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని అనుకుంటున్నా’’ అని పేస్ తెలిపాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ నాటికి పేస్ 48వ పడిలో అడుగుపెడతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.