మన క్రికెటర్లూ ఆహార ప్రియులే..!
ఫిట్గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. ...
చిత్రం: అధికారిక ట్విటర్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: ఫిట్గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. అలా మన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇష్టపడే ఆహారం ఏంటి? వారు మెచ్చిన ఆహార పదార్థాలేంటి? ఓ లుక్కేయండి.
విరాట్ కోహ్లీ
భారత జట్టులో ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్ కెప్టెన్ కోహ్లీ. ఎంతో మంది యువ క్రికెటర్లు విరాట్ని చూసి ఫిట్నెస్లో ప్రేరణ పొందుతుంటారు. చిన్నతనంలో నూడుల్స్, పఫ్స్ వంటి చిరుతిళ్లు ఇష్టంగా తినే ఈ దిల్లీ కుర్రాడు గత ఎనిమిదేళ్లుగా వాటన్నిటినీ తినడం తగ్గించాడు. రోజూ రెండు గంటలు జిమ్, ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నాడు. కానీ విరాట్కి జపనీస్ ఆహారమంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ‘సుశి’ అనే వంటకాన్ని వీలు చిక్కినప్పుడల్లా లాగించేస్తాడు. ‘ఆలూ పరాఠా, చోలే భటూరే’ తదితర పంజాబీ వంటకాలన్నా తనకి మహా ఇష్టం.
ఎం.ఎస్ ధోనీ
బేసిక్గా మన మాజీ భారత క్రికెట్ జట్టు సారథి ఆహార ప్రియుడు. సమయం దొరికితే చాలు డైట్ కాస్త పక్కన పెట్టి నచ్చిన ఆహారం లాగిస్తాడు. ధోనీకి చికెన్తో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. చికెన్ కబాబ్స్, చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా.. ఇలా చికెన్తో తయారైన ఏ వంటనైనా ఇష్టంగా తింటాడంటారు. ఓసారి ధోనీ ట్విటర్ బయోపై ఓ లుక్కేయండి. ఎప్పటికీ ‘హంగ్రీ ఫర్ చికెన్ బటర్ మసాలా’ అని రాసుకొచ్చాడు. హల్వా, కీర్ వంటి తియ్యని పదార్థాలనీ ఇష్టంగా తింటాడు.
రోహిత్ శర్మ
ఈ ముంబయి ఇండియన్సు కెప్టెన్కి వడపావ్, పావ్భాజీ అంటే చాలా ఇష్టం. రోహిత్ ఏం తీసుకుంటావ్... అని ఎవరైనా అడిగితే చటుక్కున ‘ఆలూ పరాఠా... ఆలూ పరాఠా’ అని బదులిస్తాడు. చైనీస్ వంటకాలపైనా మక్కువ చూపుతాడు. తన డైట్లో భాగంగా కోడిగుడ్లను ఎక్కువగా తీసుకుంటాడు.
కే.ఎల్ రాహుల్
ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే చాలు, పరుగుల వరద పారించే యువ క్రికెటర్ కే.ఎల్ రాహుల్. ఫిట్నెస్కి చాలా ప్రాధ్యానం ఇస్తాడీ కర్ణాటక కుర్రాడు. చిరుతిళ్లు, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల వైపు అసలే చూడడు. కానీ జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికితే రుచిరుచిగా ఉండే జపనీస్ ఫుడ్ తినేందుకు ఉవ్విళ్లూరుతాడు. చేపలు, పీతల వంటి సీఫుడ్ అంటే ఇష్టపడతాడు. రకరకాల రుచుల్లోని దోశలన్నా తనకిష్టమే.
రిషబ్ పంత్
యుజ్వేంద్ర చాహల్ మాటల ప్రకారం భారత క్రికెట్ జట్టులో అత్యధిక ఆహార ప్రియుడు రిషబ్ పంత్. ముందుంది శాకాహారమైనా, మాంసాహారమైనా ఇష్టంగా లాగించేయడమే పంత్ పనంట. టేబుల్ మీద పది వంటకాలుంటే అన్నింటినీ రుచి చూసేవరకు టేబుల్పై నుంచి కదలడట పంత్. ఆలూ పరాఠ అంటే పంత్కి చాలా ఇష్టమంటా. చోలే భటూరే అనే ఆహారాన్ని ఇష్టంగా లాగించేస్తాడంట ఈ యువ వికెట్ కీపర్. ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా.. చివరికి ఐస్క్రీంని రుచి చూడనిదే టేబుల్ నుంచి కదలడంట ఈ డైనమిక్ ప్లేయర్.
యుజ్వేంద్ర చాహల్
స్పిన్ అస్త్రాలు సంధిస్తూ, చిచ్చర పిడుగులా వికెట్లు తీస్తూ... ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే చాహల్ ఆహారానికి అధిక పాధాన్యతనిస్తాడు. బటర్ చికెన్ అంటే తనకెంతో ఇష్టం. దేశీయ వంటకాలన్నా మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఉత్తర భారత వంటకాలని చాలా ఇష్టంగా ఆరగిస్తాడు. చోలే కుల్చే, పానీ పూరీ, దాల్ తడ్కా, రాజ్మా చావల్ వంటి ఆహార పదార్థాలని ఇష్టంగా లాగించేస్తాడు. గ్రీన్ చట్నీ అంటే చాహల్కి చాలా ఇష్టం.
జస్ప్రీత్ బుమ్రా
మెరుపు వేగంతో యార్కర్లు వేసే బుమ్రా ఫిట్నెస్ ప్రియుడు. బయటి ఆహారం, చిరుతిళ్ల జోలికి పోడు. ఖాళీ సమయాల్లోనూ తనదైన ప్రొటీన్తో కూడిన డైట్నే పాటిస్తాడు. ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యతనిస్తాడు. గుజరాతీ వంటకం ధోక్లా తన ఫేవరిట్. సోన్పాపిడీ, గులాబ్జామ్ ఇష్టంగా తింటాడు. చికెన్తో చేసిన వంటకాలన్నా ఇష్టపడతాడు. చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా, కబాబ్తో పాటు చేపలని ఇష్టంగా లాగించేస్తాడు.
భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్కి తీపి పదార్థాలంటే మక్కువ. ‘నాకు తీపి దంతాలు కూడా ఉన్నాయండీ’ అంటాడు ఈ పేస్ వీరుడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అసలు డైటే పాటించని భువి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక డైట్ని ఫాలో అవుతున్నాడు. ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. భోజనంలో ఎక్కువగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. ఇంటి వంటకే ప్రాధాన్యతనిస్తాడు. ‘కది చావల్’ అంటే భువికి చాలా ఇష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా