2006లోనే రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు: లక్ష్మణ్
కెప్టెన్ కూల్గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ అంతే కూల్గా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్ఇండియాకు...
మా అందరినీ కూర్చోబెట్టుకొని బస్సులో తీసుకెళ్లాడు
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్ కూల్గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ అంతే కూల్గా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్ఇండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని మాట్లాడుతున్నారు. అయితే, తాను ఆడే రోజుల్లో మహీలోని మరో కోణాన్ని చూశానని చెప్పాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్. మాజీ సారథి రిటైర్మెంట్ అనంతరం స్టార్స్పోర్ట్స్ ‘క్రికెట్ కనెక్టెడ్’ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్తో మాట్లాడుతూ రెండు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోనీ చేసిన ఆ రెండు విశేషాలు తానెప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు.
ధోనీ 2006లో పాకిస్థాన్పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ నివ్వెరపరిచాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ‘‘పాక్ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్లో జరిగిన రెండో టెస్టులో మహీ ఈ ఫార్మాట్లో తొలి శతకం బాదాడు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి గట్టిగా ఇలా అరిచాడు. ‘నేనిప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఎంఎస్ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్లో ఇంతకుమించి నాకేం వద్దు’ అని చెప్పాడు. మేమంతా ఒక్కసారిగా అలా చూస్తుండిపోయాం’’ అని వీవీఎస్ వివరించాడు. అలాగే మరోసారి టీమ్ఇండియా సారథిగా ఉన్నప్పుడూ జట్టు మొత్తాన్ని అయోమయానికి గురిచేశాడని చెప్పాడు. 2008లో నాగ్పూర్లో టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు ఒక రోజు మైదానం నుంచి హోటల్ వరకు బస్సును నడిపాడని చెప్పాడు. డ్రైవర్ను వెనక్కి వెళ్లమని చెప్పి అందరినీ తీసుకొని హోటల్ వరకు తీసుకెళ్లాడని వివరించాడు. ధోనీ అంటే అంతగా కలిసిపోతాడని, బయట జీవితాన్ని సరదాగా గడుపుతాడని పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
ఆటలో మెరిసి..మా మదిలో నిలిచి..థాంక్యూ వైజాగ్!
మహి చూపినదారిలో..
కన్నీళ్లు దాచుకునే ఉంటావ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)