టెస్టు ఛాంపియన్షిప్లో ఐసీసీ కీలక నిర్ణయం!
తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్షిప్లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్లు రద్దవ్వడంతో పాయింట్ల పరంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా జట్లను
ఇంటర్నెట్డెస్క్: తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్షిప్లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్లు రద్దవ్వడంతో పాయింట్ల పరంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా జట్లను ఫైనల్కు ఎంపిక చేస్తారని సమాచారం. సోమవారం నుంచి జరగనున్న ఐసీసీ చివరి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
మహమ్మారి కారణంగా రద్దైన మ్యాచ్లకు పాయింట్లను ఇరు జట్లకు సమానంగా ఇవ్వాలని ఐసీసీ తొలుత భావించింది. కానీ దాని బదులుగా విజయాల శాతం ప్రక్రియను కొనసాగించాలని యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఛాంపియన్షిప్లో టాప్-9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్కు 120 పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకి నాలుగు టెస్టుల సిరీస్లో ఒక్కో మ్యాచ్కు 30 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా రెండు టెస్టుల సిరీస్ అయితే ఒక మ్యాచ్కు 60 పాయింట్లు కేటాయిస్తారు. మొత్తంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జూన్లో లార్డ్స్ వేదికగా ఫైనల్లో తలపడతాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలుస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో విజయాల శాతం పరంగా చూస్తే.. ఆస్ట్రేలియా (296 పాయింట్లు, గెలుపు శాతం 82.22 ), భారత్ (360 పాయింట్లు, 75%), ఇంగ్లాండ్ (292 పాయింట్లు, 60.83%), న్యూజిలాండ్ (180 పాయింట్లు, 50%), పాకిస్థాన్ (166 పాయింట్లు, 39.52%) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. విజయాల శాతం ఆధారంగా ఫైనల్కు జట్లు అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటిస్తే.. జట్ల అవకాశాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం.
* స్వదేశంలో జరగనున్న పాకిస్థాన్, వెస్టిండీస్ సిరీస్ల్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు కివీస్ గెలుపు శాతం 70కి చేరుతుంది.
* భారత్పై ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల్లో విజయం సాధిస్తే గెలుపు శాతం 86.67కి చేరుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో మూడు టెస్టులు పరాజయాన్ని చవిచూస్తే ఆసీస్ గెలుపు శాతం 69.33కి పడిపోతుంది.
* ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్లను కైవసం చేసుకుంటే టీమిండియా ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఆస్ట్రేలియా చేతిలో నాలుగు టెస్టులు ఓటమిపాలై, ఇంగ్లాండ్పై అయిదు టెస్టులు విజయం సాధిస్తే.. టీమిండియా 480 పాయింట్లు, గెలుపు శాతం 66.67 సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో 1-3తో ఓడి, ఇంగ్లాండ్పై 5-0తో గెలిస్తే 510 పాయింట్లు, విజయాల శాతం 70.83 అవుతుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లాండ్పై 5-0తో విజయం సాధిస్తే 500 పాయింట్లు, 69.44 గెలుపు శాతం నమోదు చేస్తుంది. ఈ సందర్భంలో న్యూజిలాండ్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. స్వదేశంలో కివీస్ సిరీస్లను క్లీన్స్వీప్ చేస్తే భారత్కు అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?