ఏబీ ఎప్పుడొస్తాడంటే..?
ఐపీఎల్-2020లో ఆడేందుకు వచ్చే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దుబాయ్లో క్వారంటైన్ ఉండదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛైర్మన్ సంజీవ్ చూరివాలా అన్నారు. ద్వైపాక్షిక సిరీసులో భాగంగా ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ అప్పటికే నియంత్రిత బయో బుడగలో ఉంటారన్నారు. స్టార్ బ్యాట్స్మన్...
వారికి క్వారంటైన్ అవసరం లేదన్న ఆర్సీబీ ఛైర్మన్
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2020లో ఆడేందుకు వచ్చే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దుబాయ్లో క్వారంటైన్ ఉండదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛైర్మన్ సంజీవ్ చూరివాలా అన్నారు. ద్వైపాక్షిక సిరీసులో భాగంగా ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ అప్పటికే నియంత్రిత బయో బుడగలో ఉంటారన్నారు. స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్, పేసర్ డేల్ స్టెయిన్, ఆల్రౌండర్ క్రిస్మోరిస్ ఎప్పుడొస్తారో ఆయన వెల్లడించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ఆయన మాట్లాడారు.
కరోనా వైరస్ ముప్పుతో ఈ సారి ఐపీఎల్ను యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు టోర్నీ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్కు వెళ్లారు. నెల రోజులు ముందుగానే చేరుకుంటే అక్కడి వాతావరణం, పిచ్లపై అవగాహన వస్తుంది. అలాగే బయో బుడగలో ఉండటం అలవాటు అవుతుంది.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్4 నుంచి 16 వరకు పరిమిత ఓవర్ల మ్యాచులు జరుగుతాయి. ఆ సిరీసులో పాల్గొన్న ఇంగ్లిష్, ఆసీస్ ఆటగాళ్లు సెప్టెంబర్ 17న దుబాయ్కు వస్తారని సంజీవ్ తెలిపారు. ప్రతి ఆటగాడు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ వారంతా అప్పటికే నియంత్రిత వాతావరణలో ఉంటారు కాబట్టి క్వారంటైన్ అవసరం లేదన్నారు. టెస్టులు చేయించుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అంతా బాగుంటే వారూ ఆరంభ మ్యాచులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆగస్టు 22న దుబాయ్లో జట్టుతో కలుస్తారని సంజీవ్ అన్నారు. శ్రీలంక క్రికెటర్లు సెప్టెంబర్ 1న వస్తారని వివరించారు. దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, క్రిస్మోరిస్, డేల్ స్టెయిన్ వస్తారన్న సంగతి తెలిసిందే. ఇక మొత్తం టోర్నీకి ఆటగాళ్లంతా దుబాయ్లోని వాల్డార్ఫ్ హోటళ్లో బస చేస్తారని సంజీవ్ తెలిపారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాలకు సులువుగా చేరుకొనేలా బసకు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 155 గదులు బుక్ చేశామని అన్ని వసతులు ఉంటాయని వెల్లడించారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఎక్కువ మంది రావడం లేదని, వచ్చిన వారూ కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.