నీ ప్రయాణం అజరామరం..
టీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్గా యువరాజ్సింగ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత...
యువీ బర్త్డే స్పెషల్ ఫొటో ఫీచర్
టీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్గా యువరాజ్సింగ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెరీర్ తొలినాళ్లలో నాట్వెస్ట్ సిరీస్ మొదలు కొని 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్తో పాటు పలు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఇంగ్లాండ్లో చివరిసారి ప్రపంచకప్ ఆడి ఆటకు వీడ్కోలు పలుకుదామని భావించిన అతడికి జట్టులో అవకాశం రాకపోవడంతో అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు యువీ 39వ జన్మదినం జరుపుకొంటున్న సందర్భంగా అతడికి సంబంధించిన పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం..
గేట్వే ఆఫ్ ఇండియా వద్ద..
2011 ఏప్రిల్ 2న ముంబయిలోని వాంఖడేలో టీమ్ఇండియా ప్రపంచకప్ ఫైనల్స్లో శ్రీలంకపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయానికి గుర్తుగా మరుసటి రోజు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ప్రపంచకప్తో యువీ.
2003 ప్రపంచకప్ ఫైనల్స్లో..
జోహెనస్బర్గ్లో జరిగిన నాటి ప్రపంచకప్ ఫైనల్స్లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆరోజు బ్రాడ్హాగ్ బౌలింగ్లో యువీ బౌండరీ బాదిన దృశ్యమిది.
ఆరు సిక్సుల్లో ఐదో సిక్స్ ఇది..
2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఆరు సిక్సులు బాదిన సంగతి తెలిసిందే. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ చుక్కలు చూపించాడు. ఆ సందర్భంలో తీసిన ఐదో సిక్సర్ చిత్రమిది.
పాకిస్థాన్పై గెలిచాక కెప్టెన్ కూల్తో..
2007 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా పాకిస్థాన్పై విజయం సాధించాక కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అరుదైన జ్ఞాపకం.
ఇదో విజయానందం..
2011 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియాపై విజయానంతరం. ఈ మ్యాచ్లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 260/6 స్కోర్ చేయగా, భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో యువీ(57*), సురేశ్ రైనా(34*)తో కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సందర్భం.
క్యాన్సర్ను జయించాక ఇలా..
2011 ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ తర్వాత అమెరికాకు వెళ్లి మెరుగైన శస్త్రచికిత్స పొందాడు. అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చాక పూర్తిగా కోలుకున్నాడు. అదే సమయంలో 2012 ఐపీఎల్లో పుణె వారియర్స్ ఆటగాళ్లతో కలిసిన సందర్భంగా తీసిన చిత్రం.
విరాట్ కోహ్లీతో కలిసివస్తూ..
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దక్షిణాఫ్రికాపై విజయం సాధించాక నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వస్తున్న చిత్రమిది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ 38 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ(76), యువరాజ్(23) నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన వేళ.
-ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
ఇప్పుడైనా ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?
కోహ్లీ లేకపోతే భారత్కు అంత నష్టమా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!