INDvsSL: అలా చేస్తే ధావన్, ద్రవిడ్కు తలనొప్పే!
వచ్చేనెలలో టీమ్ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే నెలలో టీమ్ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం. జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుండగా.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా మ్యాచ్ల్లో ఆరుగురు స్పిన్నర్లను ఎలా ఆడిస్తారని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సందేహం వెలిబుచ్చాడు. అది కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్కు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నాడు.
‘ఈ పర్యటనలో ఆరుగురు స్పిన్నర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇందులో స్పిన్నర్లను ఎవరు ఎంపిక చేస్తారు? వీరిలో ఎవరిని.. ఎప్పుడు.. ఎలా ఆడించాలనే విషయాలపై కెప్టెన్, కోచ్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాహుల్ చాహర్, యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ను తీసుకున్నారు. అయితే, ముగ్గురు స్పిన్నర్ల కన్నా ఎక్కువ ఏ మ్యాచ్లోనూ ఆడించే అవకాశం ఉండదు. కొన్నిసార్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం కూడా కష్టమవుతుంది. సహజంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. ఇక ఇందులో కృనాల్ పాండ్య కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడి తర్వాత ఫినిషర్లు లేరు. దాంతో మరో ఇద్దరు స్పిన్నర్లకే అవకాశం ఉంటుంది’ అని మాజీ క్రికెటర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
అలాగే యుజువేంద్ర చాహల్ను వన్డేల్లో కచ్చితంగా ఆడిస్తారని, దాంతో ఆ సిరీస్లో గరిష్టంగా ఇంకో స్పిన్నర్కు మాత్రమే అవకాశం ఉంటుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండో స్పిన్నర్గా కుల్దీప్కు అవకాశమివ్వాలని చెప్పాడు. ఎందుకంటే అతడిని టీ20ల్లో ఆడించే అవకాశం లేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్ను ఎందుకు ఎంపిక చేశారని మాజీ బ్యాట్స్మన్ సందేహం వెలిబుచ్చాడు. కాగా, టీమ్ఇండియా ఈ పర్యటనలో వివిధ స్పిన్ బౌలింగ్ జోడీలను ప్రయత్నించాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాహల్, కుల్దీప్ను వన్డేల్లో.. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ను టీ20ల్లో ఆడించే అవకాశం ఉంది. కృనాల్కు తుది జట్టులో ఉండే అవకాశం ఉండటంతో కృష్ణప్పని అదనపు ఆటగాడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?