గాయపడ్డా.. బౌలింగ్ ఒప్పుకొన్న కారణమదే!
కీలకమైన బ్రిస్బేన్ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్ఇండియా యువపేసర్ నవదీప్ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్ చేస్తానన్నాని...
దిల్లీ: కీలకమైన బ్రిస్బేన్ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్ఇండియా యువపేసర్ నవదీప్ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్ చేస్తానన్నాని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైని ఆఖరి టెస్టులో గాయపడ్డ సంగతి తెలిసిందే.
‘గాయపడ్డా బౌలింగ్ చేయగలవా అని అజింక్య భాయ్ అడిగాడు. అందుకు నేను ఔననే జవాబిచ్చాను’ అని సైని అన్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం దక్కినా గాయపడటంతో బాధపడ్డానని అతడు వెల్లడించాడు. ‘నేను బాగున్నాను. కానీ హఠాత్తుగా గాయపడ్డాను. సుదీర్ఘకాలం తర్వాత అవకాశం దక్కింది. అందుకే అత్యంత కీలకమైన ఆటలో నాకే ఎందుకిలా అయిందని బాధపడ్డా. గాయపడ్డా జట్టుకు ఎలాగైనా సాయపడాలని కోరుకున్నా. ఎందుకంటే ఇలాంటి మ్యాచులు మళ్లీమళ్లీ రావని తెలుసు’ అని సైని అన్నాడు.
‘ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తా’ అని సైని తెలిపాడు. టెస్టుల్లో తీసిన నాలుగు వికెట్లలో మొదటి వికెట్ ఎంతో ప్రత్యేకమని అతడు పేర్కొన్నాడు. ‘అన్ని వికెట్లూ ప్రత్యేకమే. అయితే మొదటి వికెట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అదే జరిగేంత వరకు మనం మొదటి వికెట్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా’ అని అన్నాడు. బౌన్స్కు అనుకూలించే ఆసీస్ పిచ్లు ఊరించినా అన్ని బంతులు షార్ట్పిచ్లో వేయలేం కదా అని వెల్లడించాడు. ‘ఆస్ట్రేలియాలో రాణించాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. వారు చివరి వరకు వదిలి పెట్టరు. జట్టు యాజమాన్యం నాకెంతో మద్దుతుగా నిలిచింది. కెప్టెన్ రహానె, రోహిత్ భయ్యా నాకు అండగా నిలిచారు. రంజీ తరహాలోనే బంతులు వేయాలని సూచించారు’ అని సైని పేర్కొన్నాడు.
హైదరాబాదీ యువపేసర్ మహ్మద్ సిరాజ్ తనకు మంచి మిత్రుడని సైని అన్నాడు. తామిద్దరం చాన్నాళ్లు భారత్-ఏకు కలిసి ఆడామని వివరించాడు. ‘నా తొలి మ్యాచులో అతడు పూర్తిగా నాతోనే ఉన్నాడు. వేగం ముఖ్యమే అయినా లైన్ అండ్ లెంగ్త్ మీదా దృష్టి పెట్టాలని నాకు సూచించాడు. సిరాజ్ భిన్నమైన బౌలర్. తండ్రి మరణించినా ఆసీస్లోనే ఉండి సాహసం చేశాడు. అతడు సాధించిందంతా జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది’ అని పేర్కొన్నాడు. తన ఎదుగుదలలో టెన్నిస్ బంతి క్రికెట్ పాత్ర ఎంతో ఉందని సైని గుర్తు చేసుకున్నాడు. రంజీల్లోకి వచ్చాకే ప్రొఫెషనల్ క్రికెట్పై దృష్టి పెట్టానన్నాడు. అంతకు ముందు ఎలాంటి లక్ష్యం లేకుండా ఆడేవాడినని పేర్కొన్నాడు. రంజీ తర్వాతే ఒక్కో మెట్టు ఎదిగానని వెల్లడించాడు.
ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్