కుంబ్లే ది గ్రేట్: పదికి పది అతడివే..!
తన స్పిన్ బౌలింగ్తో భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్...
పాకిస్థాన్పై చెరగని ముద్ర..
ఇంటర్నెట్డెస్క్: తన స్పిన్ బౌలింగ్తో భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్ కూడా అతడే. ఇవి మాత్రమే కాదు. ఆధునిక క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మన మాజీ సారథి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఆ ఘనత సాధించి నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలను గుర్తుచేస్తూ కుంబ్లే తీసిన పది వికెట్ల వీడియోను బీసీసీఐ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్ విశేషాలేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం.
12 పరుగుల ఓటమి..
1999లో పాకిస్థాన్ రెండు టెస్టుల పర్యటన కోసం భారత్కు వచ్చింది. అయితే, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సచిన్(136) విరోచితంగా పోరాడినా భారత్ ఓటమిపాలైంది. తొలుత పాక్ 238 పరుగులు చేయగా, భారత్ 254 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి జట్టు 286 పరుగులు చేసి భారత్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే సచిన్ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అతడు ఔటవ్వడంతో భారత్ స్వల్ప తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో తర్వాతి టెస్టులో టీమ్ఇండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
కుంబ్లే తిప్పేశాడు..
ఇక దిల్లీలోని అప్పటి కోట్లా మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 252 పరుగులు సాధించింది. ఆపై పాకిస్థాన్ను 172 పరుగులకే పరిమితం చేసింది. దీంతో టీమ్ఇండియాకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 339 పరుగులు చేయడంతో పాక్ ముందు 419 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 207 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ రెండో ఇన్నింగ్స్లో అన్ని వికెట్లు తీసింది అనిల్ కుంబ్లే ఒక్కడే. తొలి వికెట్ నుంచి చివరి వికెట్ వరకూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు కొరకరాని కొయ్యగా మారాడు. అలా ఆధునిక క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 1956లో ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీశాడు. తర్వాత ఆ ఘనత సాధించింది కుంబ్లే మాత్రమే.
ఇవీ చదవండి..
‘రూట్’ను తప్పించడం ఎందుకింత కష్టం!
ద్రవిడ్పై సచిన్ అలిగిన వేళ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా