Aussies Captain: ఆసీస్ కెప్టెన్గా ఆ ఫాస్ట్ బౌలర్ అయితే బెటర్: ఆకాశ్ చోప్రా
మహిళతో అసభ్యకర సందేశాల చాటింగ్ చేసినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని...
స్టీవ్స్మిత్ కూడా అర్హుడేనన్న క్రికెట్ విశ్లేషకుడు
ఇంటర్నెట్ డెస్క్: మహిళతో అసభ్యకర సందేశాల చాటింగ్ చేసినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ 8 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎంపికపై క్రికెట్ ఆస్ట్రేలియా వేట కొనసాగిస్తోంది. 2018లో స్టీవ్స్మిత్ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాక పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు 2019లో ఇంగ్లాండ్లో జరిగిన యాషెస్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్నా.. భారత్తో అంతకుముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడిన రెండు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసభ్యకర సందేశాల వివాదం తెరపైకి రావడంతో అతడు ఇటీవల కెప్టెన్సీని వదులుకున్నాడు. యాషెస్ సిరీస్లో ఆటగాడిగానైనా ఆసీస్ జట్టులో కొనసాగాలని ఉందని పైన్ పేర్కొన్నాడు. ట్రోఫీ సాధించి ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్గా ఎవరుంటారనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ క్రీడా విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా ముగ్గురు క్రికెటర్ల పేర్లను సూచించాడు. అందులో మాజీ సారథి స్టీవ్ స్మిత్ కూడా ఉండటం విశేషం. మిగతా ఇద్దరిలో ప్యాట్ కమిన్స్, మార్నస్ లబుషేన్ ఉన్నట్లు పేర్కొన్నాడు. ‘‘నా అంచనా ప్రకారం ముగ్గురిలో పాట్ కమిన్స్ అందరికంటే రేసులో ముందున్నాడు. ఫాస్ట్బౌలర్ అయిన కమిన్స్ యాషెస్లోని అన్ని మ్యాచులను ఆడగల సత్తా ఉన్నవాడు. మరోవైపు స్టీవ్ స్మిత్పై బాల్ ట్యాంపరింగ్ కళంకం ఉంది. అయినా అతడూ కెప్టెన్సీకి అర్హుడే. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నైతికత ఆధారంగా నిర్ణయం తీసుకుంటే పాట్ కమిన్స్కే ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. ఒక వేళ బౌలర్ను కాదు.. బ్యాటర్నే సారథిగా ఎంపిక చేద్దామని లబుషేన్ను ఎంచుకుంటే మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక వేళ ప్యాట్ కమిన్స్ను వద్దనుకుని లబుషేన్ వైపు మొగ్గు చూపితే ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యాషెస్ అనేది ఎంతో ఒత్తిడి ఉండే టెస్టు సిరీస్. కాబట్టి లబుషేన్కు అనుభవం సరిపోకపోవచ్చు. అప్పుడు లబుషేన్ కంటే స్మిత్ అయితేనే బెటర్’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.