కోహ్లీ ఒక్కడే: తొలి రోజు రక్షణాత్మకం
తొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల ఆధిపత్యం. రెండో సెషన్లో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ పోరాటం. మూడో సెషన్లో జోరు పెంచిన సారథి, ఉపసారథి నిష్ర్కమణ.. కంగారూల పైచేయి. ఇదీ స్థూలంగా ఆస్ట్రేలియా, భారత్ డే/నైట్ టెస్టు మొదటి రోజు ఆట. గులాబి పోరులో...
233/6తో నిలిచిన టీమ్ఇండియా
అద్భుతంగా బంతులేసిన ఆసీస్ పేసర్లు
అడిలైడ్: తొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల ఆధిపత్యం. రెండో సెషన్లో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ పోరాటం. మూడో సెషన్లో జోరు పెంచిన సారథి, ఉపసారథి నిష్ర్కమణ.. కంగారూల పైచేయి. ఇదీ స్థూలంగా ఆస్ట్రేలియా, భారత్ డే/నైట్ టెస్టు మొదటి రోజు ఆట. గులాబి పోరులో మెరుపులు మెరిపిస్తుందనుకున్న భారత్ తొలిరోజు, గురువారం పూర్తిగా రక్షణాత్మకంగా ఆడింది. ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (15 బ్యాటింగ్), వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
షా.. ష్!
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు తొలి ఇన్నింగ్స్లో శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ చేజార్చుకుంది. సన్నాహక మ్యాచులోనే విఫలమైన ఓపెనర్ పృథ్వీషా (0) మిచెల్ స్టార్క్ విసిరిన ఇన్నింగ్స్ రెండో బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. రెండు బౌండరీలు బాదిన మయాంక్ అగర్వాల్ (17; 40 బంతుల్లో 2×4) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. జట్టు స్కోరు 32 వద్ద కమిన్స్ వేసిన 18.1వ బంతికి వికెట్ చేజార్చుకున్నాడు. అయితే పుజారాతో కలిసి రెండో వికెట్కు అతడు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
లైయన్తో పుజారా యుద్ధం
ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసిన నయావాల్ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. బంతి ఏదైనా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ లైయన్కు అతడికి మధ్య కనిపించని యుద్ధం జరిగింది. పరస్పరం మైండ్గేమ్ ఆడారు. విరాట్తో కలిసి పుజారా మూడో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో 49.3 ఓవర్ల (300 బంతులు)కు టీమ్ఇండియా 100/2 పరుగులు చేసింది. అయితే లైయన్ వేసిన ఆ తర్వాతి బంతికే అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో ఆసీస్ సమీక్షకు వెళ్లి విజయవంతం అయింది. అజింక్య రహానె రావడంతో 107/3 వద్ద టీమ్ఇండియా తేనీటి విరామానికి వెళ్లింది.
జింక్స్తో కలిసి కోహ్లీ పోరాటం
తొలి రెండు సెషన్లలో ఆచితూచి ఆడిన టీమ్ఇండియా మూడో సెషన్లో గేర్లు మార్చింది. బంతి పాతబడటంతో కోహ్లీ, రహానె సొగసైన బౌండరీలు బాదేశారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగులు రాబట్టారు. అదే జోరులో 123 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా జింక్స్ సైతం ఓ చక్కని సిక్సర్తో అలరించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 168 బంతుల్లో 88 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించి జట్టు స్కోరును 150 దాటించారు.
వరుస షాకులు
ఇక స్కోరుబోర్డు పరుగులు పెడుతుందని భావించగా జట్టు స్కోరు 188 వద్ద కోహ్లీ రనౌట్ అయ్యాడు. రహానె అనవసర పరుగుకు ప్రయత్నించడంతో శతకం వైపు పయనిస్తున్న కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. దాంతో 188/3తో పటిష్ఠగా కనిపించిన టీమ్ఇండియాకు ఊహించని షాక్ తగిలినట్టు అనిపించింది. మరికాసేపటికే అర్ధశతకానికి చేరువైన రహానె సైతం జట్టుస్కోరు 196 వద్ద స్టార్క్ విసిరిన బంతికి ఎల్బీ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న హనుమ విహారి (16; 25 బంతుల్లో 2×4)ని 82.2వ బంతికి హేజిల్వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పుడు స్కోరు 206. ఆ తర్వాత నైట్ వాచ్మన్ రవిచంద్రన్ అశ్విన్ (15; 17 బంతుల్లో 1×4), వృద్ధిమాన్ సాహా (9; 25 బంతుల్లో 1×4) వికెట్ పోకుండా ఆడి టీమ్ఇండియాను 89 ఓవర్లకు 233/6తో నిలిపారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హేజిల్వుడ్, కమిన్స్, లైయన్ తలో వికెట్ తీశారు. రెండో రోజు భారత్ 250+ పరుగులు చేస్తే బౌలర్లకు పోరాడే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!