Bangalore : మొన్న ఆటగాళ్ల మద్దతు.. నేడు ఇంకో అడుగు ముందుకేసిన బెంగళూరు యాజమాన్యం
ఇవాళ ముంబయి, దిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయికి పెద్దగా ఉపయోగం లేకపోయినా దిల్లీ చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మ్యాచ్...
ఇంటర్నెట్ డెస్క్ : ఇవాళ ముంబయి, దిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయికి పెద్దగా ఉపయోగం లేకపోయినా దిల్లీకి చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఫలితంతోనే బెంగళూరు ప్లేఆఫ్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. తమ జట్టు సభ్యులందరూ ముంబయికే మద్దతు ప్రకటిస్తున్నామని ఇప్పటికే ఆ జట్టు సారథి డుప్లెసిస్తోపాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. గుజరాత్పై విజయం సాధించిన అంనంతరం డుప్లెసిస్, కోహ్లీ మాట్లాడారు. ఈ క్రమంలో నేడు బెంగళూరు యాజమాన్యం ఏకంగా తమ ట్విటర్ ప్రొఫైల్ పిక్నే మార్చేసింది. బ్యాక్గ్రౌండ్లో నీలం రంగు వచ్చేలా డిజైన్ చేసింది. గతంలో ఎర్ర రంగు ఉండే స్థానంలో బ్లూ కలర్తో నింపేసింది.
ఇప్పటికే గుజరాత్ (20), రాజస్థాన్ (18), లఖ్నవూ తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి. ఇక మిగిలింది ఆఖరి బెర్తు మాత్రమే. దీని కోసం బెంగళూరు (16, -0.253 నెట్రన్రేట్), దిల్లీ రేసులో మిగిలాయి. దిల్లీ 13 మ్యాచుల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబయిపై విజయం సాధిస్తే మెరుగైన రన్రేట్తో దిల్లీ నాలుగో స్థానం కైవసం చేసుకుంటుంది. బెంగళూరు ఇంటిముఖం పడుతుంది. దిల్లీ ఓడితే మాత్రం బెంగళూరు ప్లేఆఫ్స్కు వెళ్లిపోతుంది. లీగ్ దశలో ఇది 69వ మ్యాచ్. ఇక రేపు హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య ఆఖరి లీగ్ (70) మ్యాచ్ ఉన్నప్పటికీ అది నామమాత్రమే అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా