ఫుట్వర్క్లో వేగం పెంచి.. అశ్విన్పై ఒత్తిడి పెంచా
వేగవంతమైన ఫుట్వర్క్తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్ అశ్విన్పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్స్మిత్ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్లేనని అనడం నవ్వుతెప్పించిందని పేర్కొన్నాడు....
సిడ్నీ: వేగవంతమైన ఫుట్వర్క్తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్ అశ్విన్పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్స్మిత్ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్లో లేనని అనడం నవ్వు తెప్పించిందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మరికొన్ని పరుగులు చేయాల్సిందని వెల్లడించాడు. శతకం చేసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
‘మరింత సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బౌలింగ్కు రాగానే యాష్ తల మీదుగా షాట్లు ఆడాను. నాకిష్టమైన చోట బంతులు వేయించేలా అతడిపై ఒత్తిడి పెంచాను. వ్యూహం ఫలించినందుకు, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. స్పిన్నర్ల బౌలింగ్లోనే వేగంగా కదిలాను. పేసర్లను ఎప్పట్లాగే ఎదుర్కొన్నా. ఈ మ్యాచ్లో నేను కాస్త దూకుడుగా ఆడాను. ఆరంభంలో బంతికో పరుగు చొప్పున చేయడంతో మంచి ఇన్నింగ్స్ను నిర్మించాను’ అని స్మిత్ అన్నాడు.
మూడు వారాల క్రితమే సిడ్నీ మైదానంలో వరుస శతకాలు చేసిన తనను ఫామ్ కోల్పోయానని విమర్శించడం నవ్వు తెప్పించిందని స్మిత్ తెలిపాడు. కొంతమంది అలాగే ఉంటారని పేర్కొన్నాడు. ‘తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోయాను. మూడో టెస్టులో పుంజుకొని శతకం చేయడంతో జట్టు మెరుగైన స్థితిలోనే నిలిచిందని అనుకుంటున్నా. మేం మెరుగైన స్కోరే చేశాం. ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. రెండోరోజు సాయంత్రం బౌలర్లు చక్కగా బంతులు విసిరి రెండు వికెట్లు తీశారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఎంసీజీ నాకెంతో ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను’ అని స్మిత్ చెప్పాడు.
క్వీన్స్లాండ్లో మూడు రోజుల లాక్డౌన్ విధించినా గబ్బాలో నాలుగో టెస్టు జరుగుతుందని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. ‘గబ్బాలో టీమ్ఇండియాతో తలపడటం మాకిష్టమే. నాకు తెలిసినంత వరకు మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే నిర్ణయం తీసుకొనేది మేం కాదు. బోర్డులు చెప్పిన చోటికి వెళ్లి ఆడటమే ఆటగాళ్ల పని. ఏదేమైనా గబ్బాలో ఆడటాన్ని మేం ఆస్వాదిస్తాం’ అని అతడు పేర్కొన్నాడు. కాగా రెండోసారి కఠిన నిబంధనలు పాటించేందుకు టీమ్ఇండియా ఇష్టపడటం లేదు. దాంతో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
రెండో రోజు మెరిసిన భారత్
జడ్డూ రనౌట్కు ఫిదా.. ఫిదా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.