IND vs SA : ఫీల్డింగ్లో మార్పులు చేయాలి.. తెలివిగా దెబ్బకొట్టారు
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోవడానికి ఫీల్డింగ్ కూడా ఒక కారణమేనని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. మైదానంలో ఫీల్డర్ల కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారని...
భారత్ x దక్షిణాఫ్రికా తొలి వన్డేపై మాజీల విశ్లేషణ
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోవడానికి ఫీల్డింగ్ కూడా ఒక కారణమేనని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. మైదానంలో ఫీల్డర్ల కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారని.. అందుకే కెప్టెన్ ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘భారత బౌలింగ్ విభాగం పేలవంగా ఏం లేదు. కొన్నిసార్లు బ్యాటర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ నుంచి మెరుగ్గా రాణిస్తున్నాడు. వన్డే సిరీస్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. భారత ఫీల్డింగ్ విభాగం కూడా కొంచెం మెరుగవ్వాల్సి ఉంది. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్కు స్లిప్, గల్లీ, గల్లీ పాయింట్లో ఫీల్డర్లను ఉంచుతారనుకున్నాను. అశ్విన్ బౌలింగ్కి లెగ్ స్లిప్, షార్ట్ లెగ్లో ఫీల్డర్లను మోహరించి ఉంటే బాగుండేది. ఫీల్డింగ్ కూర్పును బట్టే బౌలర్లు బంతులేస్తారు. కాబట్టి, భారత్ ఈ విషయంపై దృష్టి సారించాలి’ అని గంభీర్ పేర్కొన్నాడు.
చాలా తెలివిగా దెబ్బకొట్టారు: సంజయ్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమ్ఇండియా ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా తెలివిగా ఆడారని, పక్కా ప్రణాళికతో భారత్ని దెబ్బతీశారని పేర్కొన్నాడు. ‘భారత్ ఒకానొక దశలో 138/1 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ (79), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లెవరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో టీమ్ఇండియా 214/8 ఓటమి అంచులకు వెళ్లింది. భారత్ అలా కుప్పకూలడం ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా తెలివిగా ఆడారు. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసి భారత్ని దెబ్బ తీశారు. మార్క్రమ్ రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తాడనుకున్నాడు. కానీ, ఐదు ఓవర్లు వేసి కీలక వికెట్ పడగొట్టాడు. మరోవైపు కేశవ్ మహరాజ్ బంతిని టర్న్ చేస్తూ కోహ్లీని ఊరించాడు. బౌలర్ ఫెలుక్వాయో.. కీపర్ డికాక్ చక్కటి సమన్వయంతో రిషభ్ పంత్ని స్టంపౌట్ చేశారు. అలాగే, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లను షార్ట్ పిచ్ బంతులతో పరీక్షించారు’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.
బుమ్రాకే సాధ్యం: డొనాల్డ్
టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్ డొనాల్డ్ ప్రశంసలు కురిపించాడు. ‘ఏ ఫార్మాట్లోనైనా యార్కర్లు సంధించడం బుమ్రాకే సాధ్యం. టెస్టుల్లో కూడా తన యార్కర్లతో వికెట్లు రాబట్టగలడు. నేనిప్పటి వరకు ఇలాంటి ఆటగాడిని చూడలేదు. బంతిని రిలీజ్ చేసే విధానం అద్భుతం. మణికట్టుతో మాయ చేస్తాడు. నా దృష్టిలో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడిగా ఎప్పటికీ మిగిలిపోతాడు’ అని అలెన్ డొనాల్డ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్