T20 World Cup: సెమీస్కు టీమిండియా వెళ్తుందన్న బ్రెట్లీ.. అయితే ఎప్పుడంటే?
టీమిండియా సెమీస్ అవకాశాలపై విశ్లేషించిన బ్రెట్లీ
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు చేరే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్బౌలర్ బ్రెట్లీ అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యాలతో రాణించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసేందుకు సిద్ధం కావాలని సూచించాడు. అలానే భువనేశ్వర్ కుమార్ పేస్ రాబట్టాలని పేర్కొన్నాడు. పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్లీ మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్తో టోర్నీలో తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నాడు. హార్దిక్ బౌలింగ్ చేయగలిగితే భారత జట్టు పటిష్ఠంగా మారినట్టేనని వ్యాఖ్యానించాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకపోతే మాత్రం టీమిండియా ఇతర అవకాశాలను పరిశీలించాలన్నాడు. అయితే, మంచి ఆల్రౌండర్గా జట్టులో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నట్లు తెలిపాడు. ‘‘పాండ్యకు మంచి నైపుణ్యం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది. డెత్ ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేయగలడు. బౌన్సర్లు, యార్కర్లు, పేస్లో మార్పులు చూపించగలడు. అందుకే టీమిండియాకు పాండ్య అదనపు బలం’’ అని విశ్లేషించాడు.
భువనేశ్వర్ విఫలమవ్వడంపైనా బ్రెట్లీ స్పందించాడు. ‘‘ఇరువైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం భువి సొంతం. ప్రపంచంలోని చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఇన్, ఔట్ స్వింగర్లను వేయలేరు. యూఏఈ వేదికలపై చాలా ప్రభావం చూపగలడు. భువనేశ్వర్ గంటకు దాదాపు 140కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతాడు. అయితే, బౌలింగ్లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని భావిస్తున్నా. పాకిస్థాన్తో మ్యాచ్లోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెంగ్త్ విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు’’ అని వివరించాడు. వైవిధ్యంగా బంతులను సంధించే క్రమంలో లెంగ్త్ విషయాన్ని భువి మరిచినట్లుగా ఉందని పేర్కొన్నాడు. మోకాలు కిందికి, లెంగ్త్లో వేయడంలో భువి దిట్ట అని.. అలాంటి బంతులకు ఎల్బీడబ్ల్యూగా లేదా కీపర్ క్యాచ్లను రాబట్టగలడని తెలిపాడు.
మూడో ఫాస్ట్ బౌలర్ వద్దనుకుంటేనే అశ్విన్కు చోటు!
జట్టులో వరుణ్ చక్రవర్తి నాణ్యమైన లెగ్బ్రేక్ స్పిన్నర్ అని.. మరోవైపు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్పెషలిస్ట్ బ్యాటర్, స్పిన్నర్ కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపడం కష్టమేనని బ్రెట్లీ విశ్లేషించాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్బౌలర్లతో దిగే అవకాశాలు చాలా తక్కువని అంచనా వేశాడు. మూడో ఫాస్ట్ బౌలర్ రాణించకపోతే అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. వచ్చే మ్యాచుల్లో టీమిండియా బుమ్రా, భువి, షమీతోపాటు నాలుగో బౌలర్గా వరుణ్ చక్రవర్తి, ఐదో బౌలర్గా జడేజాను ఎంచుకోవచ్చని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.