Umran Malik: టీమ్ఇండియాలో ఉమ్రాన్ అత్యంత గొప్ప బౌలర్ అవుతాడు: చమిందా వాస్
హైదరాబాద్ యువ పేస్ సంచలనం, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ టీమ్ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్ అవుతాడని శ్రీలంక దిగ్గజ పేసర్...
(Photo: Umran Malik Instagram)
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాద్ యువ పేస్ సంచలనం, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ టీమ్ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్ అవుతాడని శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టోర్నీలో చాలా నిలకడగా బౌలింగ్ చేస్తూ.. 150కిమీ వేగానికి పైగా బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఈ సీజన్లో అతడు అత్యధికంగా 157 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు. దీంతో చాలా మంది క్రికెట్ పండితులే కాకుండా ఇతర రంగాల వారు సైతం అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని వెంటనే టీమ్ఇండియాలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో లంక మాజీ పేసర్ చేరాడు.
‘తాజాగా ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన శ్రీలంక మాజీ పేసర్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఉమ్రాన్ రోజు రోజుకూ రాటుదేలుతున్నాడు. మేటి పేసర్గా తయారవుతున్నాడు. గతేడాది కూడా హైదరాబాద్ జట్టులో అతడు బౌలింగ్ చేయడం నేను చూశాను. చాలా నిలకడగా 150 కిమీల వేగానికి పైగా బౌలింగ్ చేస్తున్నాడు. టీ20 క్రికెట్లో కచ్చితత్వం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అతడు ఇలాగే రాణిస్తే టీమ్ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్ అవుతాడు. ఒకవేళ భారత జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే రాబోయే టీ20 ప్రపంచకప్లో బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తాడు. తర్వాత చాలా దూరం ప్రయాణిస్తాడు’ అని వాస్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ 8.93 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు