Chennai: చెన్నై ఇప్పటికీ మూడు లేదా నాలుగులో నిలవొచ్చు.. ఎలాగంటే?
భారత టీ20 లీగ్ అత్యంత కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి...
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి. దీంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ చాలా కీలకమైనది. ఇప్పుడు టాప్-4లో నిలిచిన లఖ్నవూ, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తున్నా మిగతా జట్లూ టాప్లోకి దూసుకొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా రాణిస్తే మూడు లేదా నాలుగులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ముంబయి: ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలే సాధించింది. దీంతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. ఇకపై బాగా ఆడి, మిగిలిన మ్యాచ్లన్నింటిలో గెలిచినా గరిష్ఠంగా ఐదో స్థానంలోనే నిలుస్తుంది.
కోల్కతా: కోల్కతా ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై అద్భుతంగా పుంజుకొని రాణించినా లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి గరిష్ఠంగా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అది కూడా ఇతర జట్లతో పోటీపడాల్సిన స్థితిలోనే. ఇది జరగాలంటే అద్భుతమే అని చెప్పాలి.
చెన్నై: ప్రస్తుతం కోల్కతా మాదిరే చెన్నై 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆదివారం దిల్లీని ఓడించడంతో కాస్త ఉపశమనం లభించింది. దీంతో ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ ఇలాగే గొప్ప విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సమానంగా 14 పాయింట్లు పంచుకునే వీలుంది. అప్పుడు వాటి కన్నా రన్రేట్ మెరుగ్గా ఉంటే మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి.
పంజాబ్: పంజాబ్ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్లు గెలవాలి. అప్పుడు రెండు, మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అది కూడా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉంటేనే. అది జరగాలంటే ఇకపై విశేషంగా రాణించాలి.
హైదరాబాద్: హైదరాబాద్ ఇప్పుడు 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఆరో స్థానంలో నిలిచింది. ఇకపై మిగిలిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. కానీ ఆదివారం బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో అవకాశాలు క్లిష్టంగా మారాయి.
దిల్లీ: దిల్లీ కూడా హైదరాబాద్లాగే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. అయితే, ఇతర జట్లతో పాయింట్లు సమానంగా ఉంటే రన్రేట్ అత్యంత కీలకం అవుతుంది.
బెంగళూరు: బెంగళూరు ప్రస్తుతం ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్-1లో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు టాప్లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
రాజస్థాన్: రాజస్థాన్ ఇప్పుడు బెంగళూరు మాదిరే 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో టాప్-3లో ఉంది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-1లో ప్లేఆఫ్స్ చేరుతుంది. అందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.
గుజరాత్: గుజరాత్ వరుస విజయాలతో మొన్నటివరకూ టాప్-1లో నిలిచినా రెండు వరుస అపజయాలతో ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించింది. ఒకవేళ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైనా నాలుగోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.
లఖ్నవూ: లఖ్నవూ ఇప్పుడు వరుస విజయాలతో టాప్లో దూసుకుపోతోంది. గుజరాత్లాగే ఈ జట్టు కూడా 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా.. అవి ఓడిపోయినా ప్లేఆఫ్స్ చేరే వీలుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించడం అందుకు కారణం.
నోట్: ఇక్కడ చెప్పిన విషయాలన్నీ జరగాలంటే ప్రతి జట్టూ ఇకపై తాము ఆడాల్సిన అన్ని మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. అది కూడా నెట్రన్ పరంగా ఇతర జట్లతో నెగ్గుకొస్తేనే.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..