T20 World Cup: ఒకవేళ రూట్ ఇండియన్ అయితే... టీ20 కెప్టెన్ అయ్యేవాడు: చోప్రా
టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ ఎంపిక చేసిన తీరును చూసి టీమ్ఇండియా మేనేజ్మెంట్ నేర్చుకోవాలని...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ ఎంపిక చేసిన తీరును చూసి టీమ్ఇండియా మేనేజ్మెంట్ నేర్చుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ తన టీమ్ను ఎంచుకుందని.. అయితే భారత్ మాత్రం ఉపఖండ సంస్కృతి ‘వ్యక్తిగత’ ప్రాధమ్యాలను అనుసరించి సెలక్షన్ చేసినట్లు పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో కీలక ఆటగాళ్లు జొఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లాండ్ వరుస విజయాలతో ఎలా దూసుకెళ్తోంది? అన్న దానికి స్పందిస్తూ.. ‘‘ఇంగ్లాండ్ ఓ ఫిలాసఫీతో ముందుకెళ్తుంది. తమ ప్రాధాన్యత ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. ఆటగాళ్లందరూ లక్ష్యం (ఒకే దిశ) వైపు వెళ్తున్నారు. దేశవాళీలో రాణించిన ఆల్రౌండర్లను ఎంపిక చేసుకున్నారు. పొట్టి ఫార్మాట్ కోసం నాట్వెస్ట్ బ్లాస్ట్ టీ20, ది హండ్రెడ్ టోర్నీల నుంచి జట్టును మేనేజ్మెంట్ ఎంచుకుంది. ఇదే వారి విజయాలకు కారణం కావచ్చు’’ అని వివరించాడు.
టీమ్ఇండియా సెలక్షన్ ప్రక్రియను కూడా ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ఒకవేళ జోయ్ రూట్ (ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్) భారతీయుడు అయి ఉంటే.. పొట్టిఫార్మాట్లో స్ట్రైక్రేట్ను పరిగణించకుండా రూట్ను కూడా టీ20 జట్టు సారథిగా టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ నియమించేదని చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే ఇంగ్లాండ్ మాత్రం చేయలేదన్నాడు. ‘‘టెస్టు ప్రదర్శనను ఇంగ్లాండ్ పరిగణనలోకి తీసుకోలేదు. వారు ఎంత మంచి ఆటగాళ్లైనా సరే పక్కన పెట్టేశారు. జోయ్ రూట్నే తీసుకుంటే టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. అలాంటి రూట్కు జట్టులో చోటు కల్పించలేదు. అదే ఇండియాలో అయితే స్ట్రైక్ రేట్తో పని లేకుండానే టీ20 టీమ్కు కెప్టెన్ని చేసేవారని నేను రాసిస్తా.. అయితే ఇంగ్లాండ్ మాత్రం ఆ విధంగా చేయలేదు. ఫార్మాట్ను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేసింది. డేవిడ్ మలన్ ఎక్కువగా టెస్టు మ్యాచ్లు ఆడలేదు. అయితే టీ20 స్పెషలిస్ట్. అలానే మొయిన్ అలీ, అదిల్ రషీద్ నుంచి ఏం ఆశిస్తున్నారో మేనేజ్మెంట్ తెలిపింది. వాళ్ల ప్రాధాన్యత ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. దాని కోసం కొంతమందిని పక్కన పెట్టి మరీ జట్టును ఎంపిక చేసుకుంది. ఇలాంటి పరిస్థితి టీమ్ఇండియా స్క్వాడ్ ఎంపికలో లేదు’’అని చోప్రా పేర్కొన్నాడు.
గ్రూప్ స్టేజ్లో వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే ఇంగ్లాండ్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇవాళ సాయంత్రం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ను ఆడనుంది. టీమ్ఇండియా (4) మాత్రం రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆఖరి మ్యాచ్లో గెలిచినా.. కివీస్, అఫ్గాన్ మ్యాచ్ ఫలితంపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ కివీస్ గెలిస్తే మాత్రం.. ఆఖరి మ్యాచ్లో భారత్ విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. కివీస్పై అఫ్గాన్ స్వల్ప తేడాతో గెలిచి.. నమీబియాపై టీమ్ఇండియా విజయం సాధిస్తే చాలు సెమీస్ బెర్తు ఖాయమైపోయిద్ది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత