Neeraj Chopra: నీరజ్ చోప్రాకు సీఎస్కే స్పెషల్ జెర్సీ!
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా రూపొందించిన జావెలిన్ ఎడిషన్ ‘ఎక్స్యూవీ 700’ వాహనాన్ని నీరజ్ చోప్రాకు పంపించిన విషయం
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా రూపొందించిన జావెలిన్ ఎడిషన్ ‘ఎక్స్యూవీ 700’ వాహనాన్ని నీరజ్ చోప్రాకు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కూడా గతంలో ప్రకటించినట్లుగా రూ.కోటి నగదు బహుమతిని నీరజ్కు అందజేసింది. అంతేకాదు.. సీఎస్కే స్పెషల్ జెర్సీని బహుకరించింది. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ జావెలిన్ త్రో రికార్డు.. 87.58మీటర్లను సంఖ్యగా మార్చి జెర్సీపై 8758 నంబర్ను ముద్రించి ఇచ్చారు. ఈ జెర్సీ, నగదు బహుమతిని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ దిల్లీలో నీరజ్కు అందజేశారు.
ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ.. ‘‘స్వర్ణం గెలిచిన తర్వాత నాపై ఇంత ప్రేమ కురుస్తుందని నేను ఊహించలేదు. కానీ.. ఇది ఇంతో సంతోషంగా అనిపిస్తుంది. మీ మద్దతు.. బహుమతులకు ధన్యవాదాలు. గత రెండు నెలలుగా ప్రకటనల షూటింగ్స్, క్రీడారంగంలో ప్రముఖుల అభినందనలతో బిజిబిజీగా గడుస్తోంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ఇకపై నేను మరింత కష్టపడతాను. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాను’’అని తెలిపాడు.
దేశం గర్విస్తోంది: విశ్వనాథన్
నీరజ్కు స్పెషల్ జెర్సీని అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ‘‘నీరజ్ చోప్రా సాధించిన విజయం పట్ల యావత్ దేశం గర్వపడుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. అలాగే రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. జావెలిన్ త్రోలో నీరజ్ సాధించిన 87.58 రికార్డు భారత క్రీడా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. నీరజ్ దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి’’అని విశ్వనాథన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు