Abhinav Bindra: విజయమంటే వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే
ప్రపంచ మానసిక దినోత్సవాన్ని ( అక్టోబర్ 10న) పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిప్రెషన్ను జయించినామె. ‘ లివ్ లవ్ లాఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆసరాగా నిలిచిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ మానసిక దినోత్సవాన్ని (అక్టోబర్ 10న) పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిప్రెషన్ను జయించినామె.. ‘ లివ్ లవ్ లాఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆసరాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజింగ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రాతో ‘లెక్చర్ సిరీస్ 2021’తో ఓ ప్రొగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఈ షోలో అభినవ్ బింద్రా తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అప్పుడు ఆటలంటే ఇష్టం ఉండేది కాదు
‘‘చిన్నప్పుడు నేను క్రీడలను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. చాలా లావుగా ఉండేవాడిని. పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆటలను మిస్ అయ్యేవాడిని. కష్టపడే మనస్తతత్వం నాలో ఉండేది. ఇదే నా టాలెంట్గా భావించేవాడిని. ఇక విజయానికి నిర్వచనం ఇవ్వమంటే ఒకటే చెబుతా.. విజయం అంటే పూర్తిగా వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే’’ అని అభినవ్ చెప్పగానే వెంటనే దీపిక..‘‘ మీరు నా మాటల్నే చెబుతున్నట్టు అనిపిస్తోంది. నేను కూడా సక్సెస్ కన్నా ఫెల్యూర్ నుంచే నేర్చుకున్నా’’ అని చెప్పారు.
స్వర్ణం సాధించాక కోచ్తో ఆ మాట చెప్పా
‘‘మీలో చాలా మందికి తెలుసో తెలియదో.. నేను స్వర్ణ పతకం సాధించానని తెలియగానే నా కోచ్తో నేను చెప్పిన మొదటి మాట. ‘జీవితంలో ఇంకెప్పుడూ షూటింగ్ చేయను’ అని ఎందుకంటే దానికోసం నేను అంతగా శ్రమించా. అందుకే మళ్లీ షూట్ చేయకూడదని నిర్ణయించుకున్నా’’ అని అభినవ్ తెలిపారు.
ఓ రోజు ఏమైందంటే..
‘‘నేను నిరుత్సాహంగా కూర్చున్నప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చారు. చాలా మంది రజతం, కాంస్యం గెలవొచ్చు. కానీ రాబోయే నాలుగేళ్లలో నువ్వు స్వర్ణ పతకం సాధిస్తావ్ అని భరోసా కల్పించింది. సరిగ్గా నాలుగేళ్ల తరువాత ఆమె చెప్పినట్టే నేను స్వర్ణం సాధించా. ఒలింపిక్స్లో పసిడి గెలిచినట్టు నా పేరు ప్రకటించగానే ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అని అభినవ్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్