మహీని ఇంత గౌరవించారంటే.. కారణం అదే
టీమ్ఇండియా ఫలితాల పట్ల భావోద్వేగపరంగా దూరంగా ఉండటమే ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతం అవ్వడానికి కారణమని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అతడి వ్యవహార శైలి బాగుంటుంది కాబట్టే అందరూ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు....
ధోనీ ఫలితాలతో సంబంధం లేనట్టు ఉండేవాడు: వీవీఎస్ లక్ష్మణ్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఫలితాల పట్ల భావోద్వేగపరంగా దూరంగా ఉండటమే ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతం అవ్వడానికి కారణమని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అతడి వ్యవహార శైలి బాగుంటుంది కాబట్టే అందరూ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో వీవీఎస్ మాట్లాడారు.
‘టీమ్ఇండియాకు నాయకత్వం వహించడం ఎవరికైనా కఠిన సవాలేనని నేను భావిస్తాను. ఎందుకంటే అతడిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచించడు. భావోద్వేగ పరంగా దూరంగా ఉంటాడు. కేవలం క్రీడాభిమానులే కాదు కోట్లాదిమంది భారతీయుల్లో అతడు ప్రేరణ నింపాడు. అణకువగా ఉంటూ దేశానికి రాయబారిగా నిలిచాడు. ప్రజల్లో మర్యాదపూర్వకంగా ఉండేవాడు. అందుకే అతడిని అంతలా గౌరవిస్తారు’ అని లక్ష్మణ్ అన్నారు. ఆగస్టు 15 సాయంత్రం మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
తన ప్రవర్తన, వ్యవహారశైలితో భవిష్యత్తు క్రికెటర్లకు ధోనీ ఆదర్శంగా నిలిచాడని వీవీఎస్ ప్రశంసించారు. ‘క్రికెట్లో సాధించిన ఘనతలను బట్టి అభిమానుల్లో ప్రేమ పుడుతుంది. వ్యవహార శైలి బాగున్నప్పుడు, మర్యాదగా నడుచుకున్నప్పుడు మాత్రమే వారి నుంచి గౌరవం లభిస్తుంది. మహీ వీడ్కోలు పలకగానే సామాజిక మాధ్యమాల్లో స్పందన చూడండి. మాజీ క్రికెటర్లు, అభిమానులే కాదు సినిమా తారలు, సామాజిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సహా అంతా స్పందించారు’ అని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి
IPL 2020: ఎదురు చూపులు నెల రోజులే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్