సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్: ఇషాంత్
వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో....
ఇంటర్నెట్డెస్క్: వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ధోనీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మహీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడని, జట్టు గురించే ఆలోచిస్తాడని లంబూ తెలిపాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ టెస్టు అనంతరం ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సిరీస్లోని ఆఖరి టెస్టుకు కోహ్లీ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు.
‘‘మెల్బోర్న్ టెస్టులో మోకాలి నొప్పితో విపరీతంగా ఇబ్బందిపడ్డాను. దాదాపు ప్రతి సెషన్కు ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా. కానీ ఆ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్ అవుతున్నాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరం టెస్టు మ్యాచ్పైనే నిమగ్నమై ఉన్నాం. నాలుగో రోజు టీ సమయానికి ధోనీ వద్దకు వెళ్లి.. ఇక నేను ఇంజెక్షన్లను తీసుకోలేనని చెప్పా. దానికి మహీ.. సరే, ఫర్వాలేదు, నువ్వు బౌలింగ్ చేయకని అన్నాడు’’ అని ఇషాంత్ తెలిపాడు.
‘‘అయితే రిటైర్మెంట్ అనంతరం.. ‘లంబూ నా ఆఖరి టెస్టులో నన్ను ఒంటరిగా విడిచిపెట్టావ్ కదా’ అని ధోనీ అన్నాడు. అదే ఆఖరి మ్యాచ్ అని తెలిస్తే కచ్చితంగా బౌలింగ్ చేసేవాడినని దానికి బదులిచ్చా. అది భావోద్వేగ సంఘటన. నిజంగా ఆ టెస్టు ఆఖరి రోజు వరకు అతడు టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నాడని తెలియదు’’ అని ఇషాంత్ తెలిపాడు.
‘‘ధోనీ దాదాపు 100 టెస్టులకు దగ్గరగా ఆడాడు. అతడు వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడు. జట్టు మంచి కోసమే ఆలోచిస్తాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో మహీతో మాట్లాడిన ఓ సందర్భం నాకు గుర్తుంది. ‘100 టెస్టుల మైలురాయిని అందుకోవడం నాకు పెద్ద విషయమేమి కాదు. వచ్చే సిరీస్ భారత్లోనే ఉంది’ అని నాతో ధోనీ అన్నాడు. అతడు సాహా ఎదుగదల గురించి ఆలోచించి రిటైర్మెంట్ ఇచ్చాడని భావిస్తున్నా. ఆ తర్వాత స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఉంది. అందుకే అతడు వీడ్కోలు పలికి ఉంటాడు’’ అని లంబూ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై పలికాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా