Olympics: రెండేసి పతకాలతో రికార్డులు.. ఒకరు జైల్లో.. మరొకరు గుండెల్లో!!
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్లో రజతం. ఈ సారి కాంస్యం. ఇలా వరుస ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మన సింధు గెలిచింది కాంస్యమే అయినా దేశ ప్రజలందరికీ ఆమె బంగారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్లో రజతం. ఈ సారి కాంస్యం. ఇలా వరుస ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మన సింధు గెలిచింది కాంస్యమే అయినా దేశ ప్రజలందరికీ ఆమె బంగారం. రాష్ట్రపతి, దేశ ప్రధాని మొదలుకొని ఆమెను కొనియాడని వారు లేరు.. ఆమె గురించి మాట్లాడుకోని వారు లేరు.
కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి గురించి కూడా దేశం మొత్తం మాట్లాడుకుంది. అతడే రెజ్లర్ సుశీల్ కుమార్. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు అతడి గురించి చర్చించుకునేవారు లేరు. అతడి క్రీడా ప్రతిభ గురించి మాట్లాడుకునే వారు లేరు. ఇప్పుడు జనం దృష్టిలో సుశీల్ కుమార్ అంటే ఓ హత్య కేసులో నిందితుడు. అంతే!
భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడెవరైనా ఉన్నారంటే అది సుశీల్ కుమారే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం పతకాన్ని ఒడిసిపట్టిన సుశీల్.. తర్వాత జరిగిన లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడిని నుంచి ఎందరో స్ఫూర్తి పొందారు. కొందరు రెజ్లర్లుగా మారారు. అంతలా స్టార్డమ్ సంపాదించుకున్న అతడిని గురువుగా భావించి రెజ్లర్గా మారిన వ్యక్తినే హత్య చేసిన నేరంలో ఇప్పుడు సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. అలాగని సుశీల్ను ఏమాత్రం తక్కువ చేయడానికి లేదు. అతడు కూడా సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలకోర్చి రెజ్లర్గా గుర్తింపు పొందాడు. ఒలింపిక్స్లో భారత కీర్తిపతాకను ఎగరేశాడు. కానీ 2012 ఒలింపిక్స్ తర్వాత స్వీయ తప్పిదాలే నేడు సుశీల్ను ఈ పరిస్థితుల్లోకి నెట్టాయి. చెడు సావాసాలు, ఈర్ష్య అతడిని అధఃపాతాళానికి తొక్కేశాయి.
ఇక రెండేసి పతకాలు సాధించిన సింధు బ్యాడ్మింటన్లో ప్రస్తుతం ఎదురులేని క్రీడాకారిణి. మనదేశంలో క్రికెట్ ఆటగాళ్లకు ఉన్నంత క్రేజ్ ఆమెది. ప్రపంచ ఛాంపియన్ షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు.. ఇలా టోర్నీ ఏదైనా ఆమె సాధించని పతకాలు లేవు. అయినా ఆమె ఇప్పటికీ నిత్య విద్యార్థే. 2004 నుంచి బ్యాడ్మింటన్లో కఠోరంగా శ్రమిస్తున్న సింధు.. విశ్రాంతి అన్నదే ఎరుగదు. ఆమెను అలసిపోవడం చూళ్లేదని ఆమెకు శిక్షణ ఇచ్చే వారు చెప్పే మాట. రియోలో రజతం సాధించాక సింధుకు ఎంతటి అపూర్వ ఆదరణ దక్కిందో తెలిసిందే. అది చూసి సింధు సంబరపడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే.. గత అయిదేళ్లలో సాధించిన అద్భుత విజయాలేవీ ఉండేవి కావు. ఒలింపిక్స్ పతకంతో సంతృప్తి చెందకుండా ప్రపంచ ఛాంపియన్ కావాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఆ దిశగా అసామాన్య రీతిలో కష్టపడింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైంది. ఆటను మరింతగా మెరుగు పరుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఆరేళ్ల ముందు వరకు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యానికే అబ్బురపడుతున్న వాళ్లకు పసిడి రుచి చూపించింది. గత ఏడాదిన్నరలో కరోనా కారణంగా టోర్నీలు లేకున్నా, ప్రాక్టీస్ కష్టమైనా.. దాన్ని సాకుగా చూపించకుండా తన శక్తిమేర శ్రమించింది. విజయ గర్వం గానీ, నిర్లక్ష్యం గానీ ఆమె డిక్షనరీలో కనిపించవు. అందుకే సింధు గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ‘మా సింధు బంగారం’ అని కీర్తిస్తోంది.
ఇద్దరు క్రీడాకారులు.. దేశం కోసం కష్టించారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం పేరును నిలబెట్టారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. విచిత్రం ఏంటంటే.. టోక్యో ఒలింపిక్స్లో సింధు పతకం ముద్దాడిన మరుసటి రోజే.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్కుమార్.. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఛార్జీషీటులోకెక్కడం!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ