Sushil Kumar: సుశీల్ ఎలా దాడి చేశాడంటే..!
యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్ మిత్రుడు సోనూ మహల్ మే 5న సుశీల్ ఏం చేశాడో మీడియాకు..
మే 5న ఏం జరిగిందో వివరించిన ప్రత్యక్ష సాక్షి
దిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్ మిత్రుడు సోనూ మహల్ మే 5న సుశీల్ ఏం చేశాడో మీడియాకు వివరించాడు.
మే 5న సుశీల్ తనను తీవ్రంగా కొట్టాడని సోనూ చెప్పాడు. ఛత్రసాల్ స్టేడియం కోచ్ వీరేంద్రను సైతం బయటకు తీసుకెళ్లి కొట్టినట్టు వివరించాడు. ఎందుకంటే ఆయన నంగోలిలో సొంతంగా కోచింగ్ కేంద్రం తెరిచారని పేర్కొన్నాడు. ఛత్రసాల్ నుంచి 50-60 మంది రెజ్లర్లను సాగర్ రాణా అక్కడికి తీసుకెళ్లడం మొదలు పెట్టడంతో సుశీల్లో కోపం కట్టలు తెంచుకొందన్నాడు. మే 4, 5 రాత్రుల్లో మునుపెన్నడూ లేనంత ఆగ్రహంతో కనిపించాడని తెలిపాడు. తను, సాగర్ సహా మొత్తం ఐదుగురిని అతడు బయటకు తీసుకెళ్లి బంధించాడని స్పష్టం చేశాడు. బంధీల్లో ఒకరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని వదిలేశాడని వెల్లడించాడు.
‘మే 4 ఉదయం నుంచి సాగర్ రాణా కోసం సుశీల్ తీవ్రంగా గాలించాడు. నీరజ్ భావ్నాతో కలిసి ఔటర్ దిల్లీ ప్రాంతంలో అమిత్, రవీంద్రను బంధించాడు. కారులోనే వారిద్దరినీ బాగా కొట్టారు. భయంతో వారు నాతో పాటు సాగర్ ఇంటి చిరునామాలు చెప్పేశారు. సుశీల్ అతడి అనుచరులతో కలిసి రాణాను బంధించి కారులో చితకబాదాడు. విడిచిపెట్టిన తర్వాత మేం ఆస్పత్రిలో చేరాం. భగత్ సింగ్ అనే రెజ్లర్నూ సుశీల్ బంధించి రాత్రంతా కొట్టాడు. దాంతో అతడి భార్య మే 5 రాత్రి తన భర్తను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని సోనూ వివరించాడు.
‘ఈ విషయం తెలిసి సుశీల్.. భగత్తో తన భార్యకు వీడియో కాల్ చేయించాడు. బాగానే ఉన్నానని, కిడ్నాప్ అవ్వలేదని చెప్పించాడు. కానీ అనుమానం వచ్చిన అతడి సతీమణి మళ్లీ పోలీసులకు ఫోన్ చేసింది. దాంతో సుశీల్ అతడిని విడుదల చేశాడు’ అని సోనూ తెలిపాడు. ఈ దాడిలో సోనూ చేతులు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేయించుకొని కడ్డీ వేయించుకున్నాడు. సాగర్ రాణా మరణించాడు. ఆ తర్వాత సుశీల్ పరారవ్వడం, పది రోజులకు దొరకడం.. కోర్టు రిమాండ్ విధించిండం తెలిసిన సంగతే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.