IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. మూడు అర్ధశతకాలు నమోదు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట..
మొదటి రోజు ఆధిపత్యం సాధించిన టీమ్ఇండియా
కాన్పూర్: సీమ్ బౌలింగ్కు అదరలేదు.. స్పిన్కు బెదరలేదు.. అనుభవం లేదని తలవంచనూలేదు.. ధనాధన్ బాదడమే కాదు.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తాచాటుతామని నిరూపించారు మన భారత యువ క్రికెటర్లు.. కివీస్తో తొలి టెస్టు మొదటి రోజు ఆటలో ముగ్గురు అర్ధశతకాలు బాదేశారు. అదీ సమయోచితంగా నిలకడగా ఆడుతూనే సాధించారు. జట్టు కష్టాల్లో పడకుండా రక్షించారు.
సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానెలను త్వరగానే ఔట్ చేసిన ఆనందం కివీస్కు దక్కకుండా చేసింది శుభ్మన్ (52), శ్రేయస్ అయ్యర్ (75*), రవీంద్ర జడేజా (50*).. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గురించే. అంతర్జాతీయంగా జడేజాకు ఎలానూ అనుభవం ఉంది కాబట్టి నిలుదొక్కుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే ఎంతో ఓపిగ్గా, అనుభవశీలిగా ఆడిన శ్రేయస్ను ఎంత పొగిడినా తక్కువే. అర్ధశతకం సాధించి నాటౌట్గా నిలిచిన శ్రేయస్ ఈ మ్యాచ్లోనే శతకం చేస్తే అది జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిద్ది. అలా అని ఓపెనర్ శుభ్మన్ గిల్, మిడిలార్డర్లో జడేజా ఇన్నింగ్స్లను తక్కువ అంచనా వేయలేం.. ముగ్గురి బ్యాటింగ్తోనే భారత్ ప్రస్తుతానికి మంచి స్థితిలో నిలిచింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా సారథి అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలు నమోదు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (75నాటౌట్: 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (52: 5 ఫోర్లు, ఒక సిక్స్), రవీంద్ర జడేజా (50 నాటౌట్: 6 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 13, ఛెతేశ్వర్ పుజారా 26, అజింక్య రహానె 35 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం
లంచ్ సమయానికి 82/1తో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియాను జేమీసన్ దెబ్బకొట్టాడు. మంచి ఫామ్లో ఉండి అర్ధశతకం సాధించిన గిల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే పుజారా కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్లో టామ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్తో కలిసి భారత సారథి అజింక్య రహానె కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. అయితే జేమీసన్ బౌలింగ్లో రహానె బోల్తాపడ్డాడు. క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. మరో వికెట్ కానీ పడితే టీమ్ఇండియా కష్టాల్లో పడేదే. అయితే శ్రేయస్-రవీంద్ర జడేజా శతక (113) భాగస్వామ్యం నిర్మించి రక్షించారు. ఆట చివర వరకు మరో వికెట్ పడనీయకుండా కాచుకున్నారు. దీంతో రెండో సెషన్లో పైచేయి సాధించిన కివీస్ బౌలర్లను మూడో సెషన్లో చిత్తు చేశారు. ఇదే క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలను నమోదు చేసుకున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.