IND vs SA : అందరి కళ్లు విరాట్పైనే.. ఏం చేస్తాడో మరి.!
ఇటీవల భారత క్రికెట్లో చాలా మార్పులు జరిగాయి. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం.. చకచకా జరిగిపోయాయి. ద్రవిడ్..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారత క్రికెట్లో చాలా మార్పులు జరిగాయి. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం.. చకచకా జరిగిపోయాయి. ద్రవిడ్ నేతృత్వంలో తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో పరాజయం పాలైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసితో ఉంది. కొత్త కోచ్, కొత్త నాయకత్వంతో.. 2023 వన్డే ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మరి దక్షిణాఫ్రికా పర్యటనలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
ఏడేళ్ల తర్వాత ఇప్పుడే...
కెప్టెన్సీకి ముగింపు పలికి పూర్తి స్థాయి బ్యాటర్గా మారిన కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగినా.. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసినా.. అందరి కళ్లు అతడిపైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటుతో మునుపటి ఫామ్ను అందుకోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజులుగా అందుకోలేకపోతున్న శతక దాహాన్ని.. ఈ సారైనా తీర్చుకుంటాడేమో చూడాలి. అంతే కాదు, యువ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్కి మైదానంలో సహకారం అందించాల్సి ఉంది. మొత్తం మీద క్రికెటర్గా కోహ్లీ రెండో ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. యథావిధిగా మూడో స్థానంలోనే కోహ్లీ బ్యాటింగ్కు దిగుతాడు. దీంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కోసం సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐదో స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఆరోస్థానంలో వెంకటేశ్ అయ్యర్ వన్డే జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు.
ఇక గాయం కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో.. కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. తనలోని నాయకుడిని నిరూపించుకోవడానికి రాహుల్కి ఇంతకు మించిన అవకాశం దొరక్కపోవచ్చు. మైదానంలో రాహుల్కి సహకారం అందించేందుకు అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ ఉన్నారు. కాబట్టి టీమ్ఇండియా భవిష్యత్ దృష్ట్యా కెప్టెన్గా రాహుల్ సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు, ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పోయిన శిఖర్ ధావన్.. ఈ సిరీస్లో రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే యువ ఆటగాళ్ల నుంచి ముప్పు తప్పకపోవచ్చు. మునుపటి ఫామ్ను అందుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్లకు ఈ సిరీస్లో చోటు దక్కే అవకాశం ఉంది. అశ్విన్ 2017లో చివరి సారిగా వన్డే క్రికెట్లో ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ పేస్ దళాన్ని నడిపంచనున్నారు. మూడో పేసర్ స్థానం కోసం.. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా టీమ్ఇండియా గత పర్యటన (2017-18)లో దక్షిణాఫ్రికాను 5-1 తేడాతో ఓడించింది. ప్రస్తుతం అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
ఆత్మ విశ్వాసంతో దక్షిణాఫ్రికా..
ఇటీవల 2-1 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తెంబా బవుమా జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఇటీవల టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేయనున్నాడు. టెస్టు సిరీస్లో అదరగొట్టిన పొడగరి మార్కో జాన్సన్.. వన్డే సిరీస్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తున్నాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్లో భాగంగా.. బోలాండ్ పార్క్ వేదికగా తొలి వన్డే బుధవారం (జనవరి 19న) ప్రారంభం కానుంది.
జట్ల వివరాలు..
భారత్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇశాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ
దక్షిణాఫ్రికా : తెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబెయిర్ హమ్జా, మార్కో జాన్సన్, జానెమన్ మలన్, సిసండ మగల, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వెయిన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రెయిజ్ షంసి, రస్సీ వాండర్ డస్సెన్, కైల్ వెరీన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్