Milkha Singh: మిల్కాసింగ్ మృతిపై ప్ర‌ముఖుల‌ దిగ్భ్రాంతి

స్ప్రింట్‌ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Updated : 19 Jun 2021 07:55 IST

దిల్లీ: స్ప్రింట్‌ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మిల్కా మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. దిగ్గ‌జ క్రీడాకారుడి మ‌ర‌ణం త‌న హృద‌యాన్ని దుఃఖంతో నింపేసింద‌న్నారు. మిల్కా క‌ష్టాలు, బ‌ల‌మైన వ్య‌క్తిత్వం అనేక త‌రాల‌కు ఆద‌ర్శం అని కొనియాడారు. దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది హృద‌యాల్లో మిల్కా ప్ర‌త్యేక స్థానం పొందార‌ని తెలిపారు. ఆయ‌న వ్య‌క్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ లో మిల్కా చెర‌గ‌ని ముద్ర వేశాడ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కొనియాడారు. గొప్ప క్రీడాకారుడిగా దేశం మిల్కాను స్మ‌రిస్తుంద‌ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని