కోపా అమెరికా టోర్నీ విజేతగా అర్జెంటీనా
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీని అర్జెంటీనా గెలుపొందింది. టోర్నీ ఫైనల్లో బ్రెజిల్పై విజయం సాధించింది.
(ఫొటో సోర్స్: కోపా అమెరికా ట్విటర్)
వాషింగ్టన్: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు శనివారం రాత్రి కోపా అమెరికా టైటిల్ కైవసం చేసుకుంది. బ్రెజిల్తో తలపడిన ఫైనల్లో అర్జెంటీనా 1-0 తేడాతో గెలుపొందింది. దాంతో అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత అతిపెద్ద టైటిల్ సాధించింది. మరోవైపు మెస్సీకి ఈ విజయం అంతర్జాతీయ టోర్నీల్లో అతిపెద్దది కావడం గమనార్హం. ఈ విజయంతో అర్జెంటీనా అత్యధిక టైటిళ్లు (15) సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. 1993 తర్వాత ఆ జట్టు కోపా అమెరికా టోర్నీని గెలవడం ఇదే తొలిసారి. ఈ ఫైనల్లో అర్జంటీనా ఆటగాడు ఏంజిల్ డి మారియా 22వ నిమిషంలో గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మరోవైపు మెస్సీ కూడా 88వ నిమిషంలో ఓ గోల్ చేయడానికి ప్రయత్నించినా ప్రత్యర్థి జట్టు గోల్కీపర్ ఎడర్సన్ దాన్ని అడ్డుకున్నాడు. దాంతో ఫైనల్లో ఈ స్టార్ ప్లేయర్ గోల్ చేయలేకపోయాడు. మొత్తంగా ఈ టోర్నీలో మెస్సీ నాలుగు గోల్స్ సాధించి బ్రెజిల్ స్టార్ నెయ్మర్తో సమానంగా నిలిచాడు. వీరిద్దర్నీ అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికచేశారు. ఏకైక గోల్ సాధించిన ఏంజిల్ డి మారియా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్ పూర్తయ్యే సమయానికి అర్జెంటీనాను విజేతగా ప్రకటించగా మెస్సీ ఉద్వేగానికిలోనయ్యాడు. సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చాడు. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెస్సీని గాల్లోకి ఎగరవేస్తూ సంబరాలు చేసుకున్నారు.
(ఫొటో సోర్స్: కోపా అమెరికా ట్విటర్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు