IND vs PAK: భారత్ 13.. పాకిస్థాన్ 0
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడేది ఆదివారమే. ఇప్పటికే ఈ మ్యాచ్ దేశంలో క్రికెట్ వేడిని పెంచేసింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన దిగ్గజాలు
పాక్, భారత్ ప్రపంచకప్ మ్యాచ్పై దిగ్గజాల అభిప్రాయం
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడేది ఆదివారమే. ఇప్పటికే ఈ మ్యాచ్ దేశంలో క్రికెట్ వేడిని పెంచేసింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్పై చర్చించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ నుంచి గంగూలీ, కపిల్ దేవ్, అజహరుద్దీన్.. పాక్ నుంచి వసీం అక్రం యూనిస్ ఖాన్, మహ్మద్ ఆమిర్ ఈ మ్యాచ్పై ఏమన్నారంటే..
‘‘ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాక్పై భారత్ ఆధిక్యం 13-0 అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యర్థిపై అజేయంగా ఉన్న రికార్డును టీమ్ఇండియా కొనసాగిస్తుంది. ఈ జట్టులోని ఆటగాళ్లందరూ నిజమైన మ్యాచ్ విన్నర్లు. ప్రపంచకప్ గెలవాలనే పదేళ్ల నిరీక్షణకు ఈ జట్టు ముగింపు పలుకుతుందనే ఆశతో ఉన్నాం’’
- సౌరభ్ గంగూలీ
‘‘ఒక బౌలర్గా నేను.. బుమ్రా ఈ టోర్నీలో ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నా. అతను ముందుకొచ్చి వికెట్లు తీయడంతో పాటు దేశం కోసం టోర్నీని గెలిచే బాధ్యత భుజాలకెత్తుకోవాలి. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవాలి. జట్టులో అతనో విశిష్టమైన ఆటగాడు. భారత్, పాక్ మ్యాచ్లో అతను నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు’’
- కపిల్ దేవ్
‘‘భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ భారీగానే ఉంటుంది. ఈ మ్యాచ్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు నెలకొంటాయి, ప్రచారం సాగుతోంది. ఈ పోరులో టీమ్ఇండియానే స్పష్టమైన ఫేవరెట్. అదే వేదికల్లో ఐపీఎల్ ఆడిన భారత్కు పాక్ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది’’
- మహమ్మద్ అజహరుద్దీన్
‘‘ధోని మెంటార్గా రావడం ఈ ప్రపంచకప్లో భారత్కు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాక్ పరంగా చూస్తే ఈ మ్యాచ్లో మా జట్టు గెలిచి టీ20 ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యాన్ని 1-5కి తగ్గిస్తుందని అనుకుంటున్నా. ఇలాంటి మ్యాచ్ల్లో రాణించిన వాళ్లే దిగ్గజాలుగా ఎదుగుతారు’’
- యూనిస్ ఖాన్
‘‘విరాట్ కోహ్లి ఓ దిగ్గజం. ఎప్పుడూ నిలకడగా రాణించే అతని ఆటతీరు అద్భుతం. భారత్, పాక్ మ్యాచ్పై ఎప్పుడూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అంతటి ఒత్తిడిలోనూ ఎలా సత్తాచాటాలో కోహ్లీకి తెలుసు’’
- మహమ్మద్ ఆమిర్
‘‘అవును.. ప్రపంచకప్ల్లో మేం భారత్ను ఓడించలేదు. కానీ ప్రపంచకప్లో అడుగు పెట్టేటప్పుడు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది గణాంక నిపుణుడి పని. కానీ ఓ ఆటగాడిగా ఈ రికార్డు నన్ను కానీ లేదా ఏ పాకిస్థాన్, భారత్ ఆటగాణ్ని కానీ ప్రభావితం చేయదనే అనుకుంటా. భారత్, పాక్ మ్యాచ్ ఎంతో కీలకమైంది. టోర్నీలో ఇదే పెద్ద మ్యాచ్’’
- వసీమ్ అక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ