పావెల్‌ విధ్వంసం

రోమన్‌ పావెల్‌ (107; 53 బంతుల్లో 4×4, 10×6) విధ్వంసక శతకంతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు

Published : 28 Jan 2022 02:54 IST

ఇంగ్లాండ్‌పై విండీస్‌ విజయం

బ్రిడ్జ్‌టౌన్‌: రోమన్‌ పావెల్‌ (107; 53 బంతుల్లో 4×4, 10×6) విధ్వంసక శతకంతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు చేసింది. పావెల్‌ సెంచరీ సాధించగా... పూరన్‌ (70; 43 బంతుల్లో 4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు  పూరన్‌తో కలిసి పావెల్‌ 122 పరుగులు జోడించాడు. భారీ ఛేదనలో ఇంగ్లాండ్‌ పోరాడినా 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులే చేయగలిగింది. టామ్‌ బాంటన్‌ (73; 39 బంతుల్లో 3×4, 6×6), ఫిల్‌ సాల్ట్‌ (57; 24 బంతుల్లో 3×4, 5×6) మెరిసినా జట్టును గెలిపించలేకపోయారు. విండీస్‌ బౌలర్లలో షెపర్డ్‌ (3/59), పొలార్డ్‌ (2/31) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ విజయంతో అయిదు టీ20ల సిరీస్‌లో విండీస్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని