బంగ్లాదేశ్‌, శ్రీలంక తొలి టెస్టు డ్రా

బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 39/2తో చివరి రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు

Published : 20 May 2022 02:02 IST

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 39/2తో చివరి రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఓ దశలో 161 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డిక్వెలా   (61 నాటౌట్‌), చండిమాల్‌ (39 నాటౌట్‌) ఆదుకున్నారు. అభేద్యమైన ఏడో వికెట్‌కు  99 పరుగులు జోడించారు. కరుణరత్నె (52), కుశాల్‌ మెండిస్‌ (49) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 397 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 465 పరుగులు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని