ఆర్చరీలో మరో కాంస్యం
ప్రపంచకప్ స్టేజ్- 2 ఆర్చరీ టోర్నీలో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రికర్వ్ మహిళల టీమ్ విభాగంలో రిధి, కోమలిక, అంకిత త్రయం మూడో స్థానంలో నిలిచింది. గురువారం కంచు పతక
గ్వాంగ్జు: ప్రపంచకప్ స్టేజ్- 2 ఆర్చరీ టోర్నీలో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రికర్వ్ మహిళల టీమ్ విభాగంలో రిధి, కోమలిక, అంకిత త్రయం మూడో స్థానంలో నిలిచింది. గురువారం కంచు పతక పోరులో భారత్ 6-2 (56-52, 54-51, 54-55, 55-54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటిన అమ్మాయిలు ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేశారు. తొలి 12 బాణాలకు గాను మూడు సార్లు 10, ఎనిమిది సార్లు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించారు. ఆ తర్వాత కాస్త తడబడ్డా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పోయింది. అంతకుముందు సెమీస్లో భారత్ 2-6 (53-55, 57-55, 51-53, 43-53)తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్