IND vs NZ: ‘‘అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు’’
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పేరు మార్మోగింది. ఎందుకంటే.. ఈ మెగా లీగ్లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. సీఎస్కే నాలుగోసారి ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు అతడిని న్యూజిలాండ్తో జరిగే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ గైక్వాడ్పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో గైక్వాడ్ ఆడుతుంటే చూడాలని ఉందన్నాడు. ఐపీఎల్లో తాను చూసిన మంచి ఇన్నింగ్స్ల్లో గైక్వాడ్ ఆడినవి కొన్ని ఉన్నాయని స్వాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో రుతురాజ్ మంచి ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ కొన్నేళ్ల కిందటే తనతో చెప్పాడని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు.
"చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ప్రత్యేకమైనవాడు. ఐపీఎల్లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయి. అబుదాబిలో గైక్వాడ్ సెంచరీ చేయడం సంచలనం. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు అతడు ఎంపికైనందుకు సంతోషిస్తున్నా. రుతురాజ్ గైక్వాడ్ ఒక సంపూర్ణమైన ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ నాతో కొన్నేళ్ల క్రితం చెప్పాడు. అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు. గైక్వాడ్ 10 మార్కులకుగాను 9 మార్కులు సాధించాడు. ఇంకా రాటుదేలుతున్నాడు’’ అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ వివరించాడు.
ఇప్పటివరకు తన కెరీర్లో నిలకడగా ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు తానెంటో నిరూపించుకోవాల్సి ఉందని స్వాన్ అన్నాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది. కానీ, అతడు నిలకడగా మంచి ప్రదర్శనలు చేయలేదు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఉన్నా.. మరికొన్ని బలహీనమైన ప్రదర్శనలూ ఉన్నాయి. నేనైతే శ్రేయస్ ఆటకు ఎనిమిది మార్కులు వేస్తా. కానీ, అతడు సులభంగా 10 మార్కులు అందుకోగలడు’ అని గ్రేమ్ స్వాన్ ముగించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు