Team India: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే హార్దిక్కు చోటు.!
గత కొన్ని నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చోటు కల్పించనున్నట్లు బీసీసీఐ వర్గాలు..
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చోటు కల్పించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ నిరూపించుకునే దానిపైనే హార్దిక్ ఎంపిక ఆధారపడి ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో హార్దిక్కు చోటు దక్కినా.. ప్రభావం చూపలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.
‘హార్దిక్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి అవసరం. దక్షిణాఫ్రికా సిరీస్కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు అతడు కోలుకుని.. ఫిట్నెస్ నిరూపించుకుంటే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తాం. అతడు త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఆ ట్రోఫీలో ఆడటం కన్నా.. అతడు ఫిట్గా ఉండటం మాకు చాలా ముఖ్యం. అయినా ఆడాలనుకుంటే అది అతడిష్టం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 3 టెస్టులు, 3 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచుల నిమిత్తం.. టీమ్ఇండియా డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.
టీమ్ఇండియా గత కొద్ది రోజులుగా ఫాస్ట్ బౌలింగ్ చేయగలిగే నాణ్యమైన ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. జట్టులో మెరుగైన ఆల్రౌండర్ లేకపోవడం పలుమార్లు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ని జట్టు యాజమాన్యం ప్రొత్సహిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అయ్యర్కి ఓ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. గుజరాత్ను తన సొంతమైదానంలోనే చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268