Dhoni - Hardik Pandya : ధోని ప్రోత్సహించకుంటే.. అప్పుడే నా కెరీర్ ముగిసిపోయేది : హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. ధోని ప్రోత్సహించకుంటే.. ఆరంభంలోనే తన కెరీర్ ముగిసిపోయేదని అన్నాడు. ఇటీవల...
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. ధోని ప్రోత్సహించకుంటే.. ఆరంభంలోనే తన కెరీర్ ముగిసిపోయేదన్నాడు. ఇటీవల అతడు ఇచ్చిన ఓ ఇంటర్వూలో తన కెరీర్ ఆరంభంలో ధోని అందించిన సహకారం గురించి వెల్లడించాడు. ధోని లేనిదే.. తన కెరీర్ లేదని పేర్కొన్నాడు.
‘భారత జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి నేను ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. ముఖ్యంగా మహీ భాయ్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. భారత జట్టుకి ఎంపికైనప్పుడు నేనో ముడి పదార్థాన్ని. అతడు నన్ను సానబట్టాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేలా ప్రోత్సహించాడు. మైదానంలో స్వేచ్ఛగా ఆడే అవకాశమిచ్చాడు. నా అరంగేట్ర మ్యాచ్లో జరిగిన ఓ ఘటన నాకు ఇంకా గుర్తుంది. నేను వేసిన తొలి ఓవర్లోనే 22 పరుగులు ఇచ్చాను. దీంతో ఇదే నా కెరీర్లో తొలి, చివరి మ్యాచ్ అవుతుందని భయపడిపోయాను. కానీ, ఆశ్చర్యకర రీతిలో ధోని నాకు మరో ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. అప్పటి నుంచి నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క ఘటనతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ధోని భాయ్ ఏం పట్టించుకోనట్టే ఉంటాడు. కానీ, ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తూ.. ఆటగాళ్ల ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తాడు. లోపాలను, బలహీనతలను ఆటగాళ్లే స్వయంగా అధిగమించాలని అతడు ఆశించేవాడు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవడంతో ఎప్పటికప్పుడూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించేవాడిని. అందుకే ఇన్నాళ్లు జట్టులో ఉండగలిగాను’ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.
వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్య గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లోకి కొత్తగా అడుగు పెట్టనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి పాండ్య కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో పాండ్య దారుణంగా విఫలం కావడంతో ముంబయి ఇండియన్స్ యాజమాన్యం వదులుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM