2020.. తెవాతియా అయిపోతే ఎంత బాగుండు!
2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకున్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనా ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్లోనూ ప్రవేశించింది...
వైరల్గా మారిన రాజస్థాన్ ట్విటర్ హెడ్లైన్
(Twitter/RahulTewatia: నితీశ్ రాణాతో తెవాతియా)
2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకొన్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనాలో ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్లోనూ ప్రవేశించింది. ఊహించని వేగంతో చాలామందిని కాటేసింది.
లాక్డౌన్లు.. ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. సాటి మనిషిని ఆప్యాయతతో హత్తుకొనేవారే కరవయ్యారు. ఎడం పెరిగింది. మాస్క్లు ముఖాలకు ఆభరణాలుగా మారాయి. ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. వానలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి.
ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది! కాలచక్రం అనూహ్యంగా మలుపులు తిరిగితే బాగుంటుందేమో అనిపిస్తోంది. మహమ్మారి కరోనా అంతమై హఠాత్తుగా ప్రశాంతత నెలకొంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు తన ట్విటర్లో పెట్టిన ఓ వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంటోంది. ‘2020 రాహుల్ తెవాతియాగా మారాలని ఆశిస్తున్నాం’ అన్న మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ మారాయి. ఎందుకంటే...
పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆటగాడు రాహుల్ తెవాతియా అప్పటి వరకు అందరినీ విసిగించాడు. సింగిల్స్ తీసేందుకూ కష్టపడ్డాడు. ఆడిన తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టాడు. ‘ఉతప్ప కాకుండా ఇతనెందుకు వచ్చాడ్రా బాబూ..!’ అనిపించాడు. కానీ హఠాత్తుగా గేర్లు మార్చి చివరి 12 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది ఔరా! అనిపించాడు. ఈ 2020 సంవత్సరం సైతం ఇప్పటి వరకు అందరినీ విసిగించింది. ఉన్నట్టుండి హాయిగా మారితే ఎంత బాగుంటుందో అనే అర్థంలో రాజస్థాన్ వ్యాఖ్య ఉండటంతో అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి