Net Run Rate: క్రికెట్లో నెట్ రన్రేట్ను ఎలా లెక్కిస్తారో తెలుసా?
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది...
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాలకే పోటీ అధికమైంది. ఈ ఉత్కంఠకర పరిస్థితుల్లో ఏయే జట్లు చోటు దక్కించుకుంటాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. లఖ్నవూ, రాజస్థాన్ ప్రస్తుతం చెరో 16 పాయింట్లతో కొనసాగుతుండగా.. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉంది. దీంతో ఈ రెండు జట్లు కూడా దాదాపు ప్లేఆఫ్స్లో బెర్తులు సొంతం చేసుకున్నట్లే. ఇక చివరగా మిగిలిన నాలుగో స్థానం కోసమే.. దిల్లీ, బెంగళూరు జట్లు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వాటితో పాటు కోల్కతా, పంజాబ్, హైదరాబాద్ సైతం పోటీలో ఉన్నా అవి అనేక సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. దీంతో నాలుగో స్థానంలో నిలవాలంటే ఏ జట్టుకైనా నెట్ రన్రేట్ కీలకం కానుంది.
నెట్రన్రేట్ ఎలా కీలకం..?
క్రికెట్లో ఏ మెగా టోర్నీలో అయినా నెట్రన్రేట్ కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్రూప్ లేదా లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన జట్లు తేలిగ్గా నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అయితే, దిగువస్థాయిలో నిలిచే జట్లు ఒక్కోసారి ఇతరులతో సమాన పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు నెట్ రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఆయా జట్ల భవిష్యత్ను నిర్దేశిస్తుంది. గతేడాది భారత టీ20 లీగ్లో.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కోల్కతా, ముంబయి చెరో 14 పాయింట్లు సాధించాయి. అయితే, రన్రేట్లో కోల్కతా (+0.587).. ముంబయి (+0.116) కన్నా కాస్త మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్కు చేరింది. అక్కడి నుంచి ఫైనల్కు దూసుకెళ్లి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. దీన్ని బట్టి నెట్ రన్రేట్ ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఎలా లెక్కిస్తారు..?
ఉదాహరణకు.. ఒక జట్టు ఏదైనా టోర్నీలో 10 మ్యాచ్లు ఆడితే.. అందులో మొత్తం మ్యాచ్ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్నే రన్స్ పర్ ఓవర్గా నిర్ణయిస్తారు. అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్లు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్లు ఆ మ్యాచ్లో నిర్దేశించిన ఓవర్లకన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కిందే లెక్కిస్తారు. ఇక్కడ కూడా సగటు పరుగులు లెక్కిస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే నెట్రన్రేట్.
ఉదాహరణ:
* ఒక టీ20 టోర్నీలో A అనే జట్టు B అనే జట్టుతో తలపడిన మ్యాచ్లో 17.2 ఓవర్లలో 180/6 పరుగులు చేసిందని అనుకుందాం..
* అలాగే C అనే జట్టుతో ఆడిన మ్యాచ్లో A టీమ్ మొత్తం 20 ఓవర్లలో 145/5 పరుగులు చేసిందని భావిద్దాం..
* ఇక D అనే జట్టుతో ఆడిన మ్యాచ్లోనూ A మొత్తం 20 ఓవర్లలో 156/5 పరుగులు చేసిందని తీసుకుందాం..
ఇప్పుడు A అనే జట్టు మొత్తం మూడు మ్యాచ్ల్లో కలిపి చేసిన పరుగులు.. 180+145+156= 481.
అలాగే ఎదుర్కొన్న ఓవర్లు కలిపితే.. 17.2+20+20=57.2
ఇప్పుడు మొత్తం చేసిన పరుగుల నుంచి ఆడిన ఓవర్లను తీసుకొని సగటు లెక్కిస్తే రన్ రేట్ పర్ ఓవర్ ఇలా వస్తుంది.. 481/57.2= 8.4090.
* ఇక A జట్టుతో B ఆడిన మ్యాచ్లో సాధించిన పరుగులు 20 ఓవర్లలో 179/6 అనుకుందాం..
* అలాగే A జట్టుతో C ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 15.2 ఓవర్లలో 110 ఆలౌటైందని భావిద్దాం..
* ఇక A జట్టుతో D ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 18 ఓవర్లలో 125 ఆలౌటైందని తీసుకుందాం..
ఇక్కడ C, D జట్లు తమకు కేటాయించిన 20 ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లలోనే ఆలౌటయ్యాయి. అలాంటప్పుడు రన్రేట్ను లెక్కించాలంటే.. ఆ పూర్తి ఓవర్ల కోటాతోనే విభజించాలి.
ఇక్కడ కూడా ఇతర జట్లు మొత్తం సాధించిన పరుగులు.. 179+110+125=414
అలాగే ఇతర జట్లు ఆడిన లేదా ఆడాల్సిన ఓవర్లు.. 20+20+20=60
ఇప్పుడు A జట్టుపై మొత్తం ఇతర జట్ల రన్రేట్ లెక్కిస్తే.. 414/60=6.9
ఇప్పుడు వచ్చిన రెండు రన్రేట్ల మధ్య ఉన్నా తేడా లెక్కిస్తే.. A జట్టు నెట్ రన్రేట్ తెలుస్తుంది.. 8.4090-6.9000= +1.509.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా