పంత్, సుందర్, అక్షర్.. టీ20ల్లో ఉంటారా?
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది...
బలంగా ఉన్న టీమ్ఇండియా రిజర్వ్బెంచ్..
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది. మిగతా మూడు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఆటగాళ్లలో ముగ్గురు యువ క్రికెటర్లు కీలకంగా ఉన్నారు. వారే.. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్పటేల్. ఈ ముగ్గురూ పొట్టి సిరీస్కు సైతం ఎంపికైన నేపథ్యంలో తుది జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ సిరీస్కోసం ఎంపిక చేసిన జాబితాలో టీమ్ఇండియా ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి రాబోయే సిరీస్లో వీరికి అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
పంత్కు పోటీగా అతడే..
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లతో పంత్ ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. టెస్టు మ్యాచ్ల్లోనే వన్డే, టీ20 ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ను మెరుగు పర్చుకొని భారత్కు అపురూప విజయాలు అందిస్తున్నాడు. అలాంటి బ్యాట్స్మన్ టీ20 సిరీస్లో తుది జట్టులో ఉంటాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో అతడికి దీటుగా ఆడే ఆటగాడు కేఎల్ రాహుల్. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అలాగే కీపింగ్లోనూ గత పరిమిత ఓవర్ల సిరీస్ల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇషాన్ కిషన్ అనే ముంబయి ఇండియన్స్ కీపర్, బ్యాట్స్మన్ పొట్టి సిరీస్కు ఎంపికయ్యాడు. అతడిని రెండో కీపర్గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, బ్యాట్స్మన్ స్థానంలో పంత్ ఉంటాడో లేదో తెలియదు. అయితే, ఇటీవల అతడు ఫామ్ అందుకున్న తీరు చూస్తుంటే కచ్చితంగా తుది జట్టులో ఉంటాడనిపిస్తోంది.
వాషింగ్టన్కూ ఉన్నారు..
వాషింగ్టన్ సుందర్ సైతం గత రెండు టెస్టు సిరీస్ల్లో బాగా రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20ల్లోనూ ఆడిన అతడు ముఖ్యంగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకుర్(67)తో కలిసి సుందర్(62) తొలి ఇన్నింగ్స్లో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆ మ్యాచ్పై టీమ్ఇండియా పట్టు సాధించడంలో తన వంతు పాత్రపోషించాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్తో సిరీస్లోనూ తొలి మ్యాచ్లో వాషింగ్టన్ 85* పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే నాలుగో టెస్టులో 96* విశేషంగా బ్యాటింగ్ చేశాడు. అలా లోయర్ మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధిస్తూ కీలకంగా కొనసాగుతున్నాడు. అయితే, పొట్టి క్రికెట్లో అవకాశం రావాలంటే వాషింగ్టన్కు కూడా గట్టి పోటీ ఉంది. అతడు ఆల్రౌండర్ కావడంతో ఈ జాబితాలో హార్దిక్ పాండ్య ఇప్పటికే నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు స్పిన్ విభాగంలో యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా ఎంపికయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
అక్షర్కు మెరుగైన అవకాశాలు..
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ మూడు మ్యాచ్ల్లోనే 27 వికెట్లు సాధించి శేభాష్ అనిపించుకున్నాడు. చెన్నై పిచ్పై రెండో టెస్టులో ఏడు వికెట్లు సాధించిన అతడు తర్వాత మొతేరాలో వికెట్ల జాతర చేసుకున్నాడు. మూడో టెస్టులో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/38, 5/32) చేశాడు. ఇక చివరి టెస్టులో మరో 9 వికెట్లతో సత్తా చాటడంతో పాటు బ్యాటింగ్లోనూ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. కాగా, టీ20 సిరీస్ సైతం అదే పిచ్పై జరుగుతున్న నేపథ్యంలో అక్షర్కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇతర స్పిన్నర్ల నుంచి పోటీ ఎదురైనా అది చాహల్ నుంచి మాత్రమే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పొట్టి సిరీస్లో ఎవరుంటారో లేదో వేచి చూడాలి.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.