PM Modi: మీ నుంచే ప్రేరణ పొందుతున్నాను: మోదీ
టోక్యో పారాలింపిక్స్ విజేతలతో సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కాగా వాటికి సంబంధించిన దృశ్యాలు తాజాగా విడుదలయ్యాయి.....
దిల్లీ: టోక్యో పారాలింపిక్స్ విజేతలతో సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కాగా వాటికి సంబంధించిన దృశ్యాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రధాని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహారవిందులో అథ్లెట్లతోపాటు వారి కోచ్లను కలిశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. ప్రతి ఒక్క అథ్లెట్తో మాట్లాడిన ప్రధాని.. వారి విజయగాథలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన 52.40 నిమిషాల వీడియోను ప్రధాని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
శారీరక వైకల్యాన్ని లెక్కచేయక.. కృషి, పట్టుదలే సోపానాలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆ క్రీడాకారులను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. టోక్యో పారాలింపిక్స్లో భారత బృందం సాధించిన పతకాలు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి స్ఫూర్తిగా నిలిచాయని, దేశంలోని క్రీడా సమాజం మనోధైర్యాన్ని పెంచిందని కొనియాడారు. మీ నుంచే నేను స్ఫూర్తి పొందుతున్నానని పారా అథ్లెట్లతో ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పతక విజేతలు ఓ తెల్లటి శాలువాపై సంతకాలు చేసి మోదీకి బహుమతిగా అందజేశారు. దాన్నీ ఆయన మెడలో వేసుకొని అథ్లెట్లతో సంతోషంగా గడిపారు.
టోక్యో పారాలింపిక్స్లో తమ అనుభవాలను పారా అథ్లెట్లు మోదీతో పంచుకున్నారు. మిమ్మల్ని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానితో సమయం గడపడాన్ని గౌరవంగా భావిస్తున్నామని.. ఇది తమకు పెద్ద విజయమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్