సూది మందు తీసుకొని ప్యాడ్లు కట్టుకున్నా: జడ్డూ
సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆడేందుకు తాను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యానని టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. ఇందుకోసం సూదిమందు సైతం తీసుకున్నానని పేర్కొన్నాడు. కనీసం 10-15 ఓవర్లు ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని వెల్లడించాడు. రిషభ్ పంత్, పుజారా....
ఇంటర్నెట్ డెస్క్: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆడేందుకు తాను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యానని టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. ఇందుకోసం సూదిమందు సైతం తీసుకున్నానని పేర్కొన్నాడు. కనీసం 10-15 ఓవర్లు ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని వెల్లడించాడు. రిషభ్ పంత్, పుజారా ఆడుతున్నంత వరకు మ్యాచ్ గెలుస్తామనే అనిపించిందన్నాడు. వారిద్దరూ ఔటవ్వడంతో డ్రా చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. ఆ సమయంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ గొప్పగా పోరాడారని ప్రశంసించాడు.
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో జడ్డూ చేతి వేలికి బంతి తగిలింది. దాంతో వేలి లోపల ఎముక విరిగింది. టెయిలెండర్లతో కలిసి పరుగులు చేయాలన్న ఆత్రంలో అతడు నొప్పిని పట్టించుకోలేదు. అయితే బ్యాటింగ్ ముగిశాక జడ్డూ నొప్పితో విలవిల్లాడాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో బంతి అందుకోలేదు. బౌలింగ్ చేయలేదు. కీలకమైన ఛేదనలో అవసరమైతే బ్యాటింగ్ చేసేందుకు ప్యాడ్లు కట్టుకొని సిద్ధమవ్వడం గమనార్హం.
‘అవును, నేను సిద్ధమయ్యా. సూదిమందూ తీసుకున్నా. కనీసం 10-15 ఓవర్లైనా ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఇన్నింగ్స్ను ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే గాయపడ్డ చేతిలో అన్ని షాట్లు ఆడలేం కదా. ఫాస్ట్ బౌలర్ల బంతులను ఎలా ఆడాలి? వారు బంతిని ఎక్కడ పిచ్ చేస్తారు? వంటివన్నీ ఆలోచించా’ అని జడ్డూ తెలిపాడు.
‘మ్యాచ్ గెలిచే దశకు చేరుకున్నప్పుడే బ్యాటింగ్ చేస్తానని జట్టు యాజమాన్యానికి చెప్పాను. పుజారా, రిషభ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో మేం గెలుస్తామనే అనిపించింది. దురదృష్టవశాత్తు పంత్ ఔటవ్వడంతో పరిస్థితి మారింది. అక్కడ్నుంచి డ్రా కోసం ఆడాల్సి వచ్చింది’ అని జడ్డూ అన్నాడు.
‘మ్యాచు కాపాడుకొనేందుకు అశ్విన్, విహారి పోరాడిన తీరు అద్భుతం. టెస్టు క్రికెట్లో ప్రతిసారీ పరుగులు చేయడమే కాదు మ్యాచును కాపాడుకోవాల్సి పరిస్థితులూ వస్తాయి. నిజంగా అదొక గొప్ప బృంద పోరాటం’ అని జడ్డూ అన్నాడు. బ్యాటింగ్ జోరులో తన వేలు విరిగిందన్న విషయం గుర్తించలేదని అతడు తెలిపాడు. పరుగుల మీదే దృష్టి సారించానన్నాడు. స్కానింగుకు వెళ్లాకగానీ చేతివేలు విరిగిందన్న సంగతి తెలియలేదన్నాడు. అయినప్పటికీ జట్టు కోసం బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యానని తెలిపాడు.
ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి