మహీ ఆడితే డబ్బు సమకూరుస్తా!
టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్, కెప్టెన్ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని...
‘వంద బంతుల’ కోసం షేన్వార్న్ ప్రతిపాదన
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్, కెప్టెన్ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని వెల్లడించాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన తర్వాత మహీ మైదానంలో కనిపించలేదు. అతడి వీడ్కోలుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్-2020లో రాణిస్తే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్కు పోటీలో ఉంటాడని అంతా భావించారు. కరోనా వైరస్ ముప్పుతో రెండు టోర్నీలూ వాయిదా పడటంతో కొన్నాళ్లు సందడి కనిపించలేదు. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ మళ్లీ జరుగుతుందని ప్రకటించగానే అందరి దృష్టి అతడిపై నెలకొంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15 సాయంత్రం ధోనీ వీడ్కోలు ప్రకటించేశాడు.
‘వచ్చే ఏడాది జరిగే ‘ది హండ్రెడ్’లో లండన్ స్పిరిట్కు మహీని తీసుకొస్తే అద్భుతమే. లార్డ్స్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడో లేదో ఒకసారి మాట్లాడతాను. ఒకవేళ అంగీకరిస్తే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తా’ అని ఇంగ్లాండ్-పాక్ మ్యాచుకు కామెంటరీ చేస్తూ షేన్వార్న్ వ్యాఖ్యానించాడు. టీ20కి పోటీగా ఇంగ్లాండ్ వంద బంతుల టోర్నీని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే టోర్నీ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ ముప్పుతో 2021కి వాయిదా వేశారు. ఒకవేళ ఇష్టపడితే ఐపీఎల్ ఆడుతున్న మహీకి బీసీసీఐ అనుమతి ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.
‘టీ20ల్లో అత్యుత్తమ నాయకులు ఉన్న జట్లు సాధారణంగా ఫైనల్కు వస్తుంటాయి. పొట్టి క్రికెట్లో ఇదే కీలకం. చెన్నై సూపర్కింగ్స్ మూడుసార్లు ఐపీఎల్ గెలిచిన సంగతి తెలిసిందే. మహీ అద్భుతమైన క్రికెటర్. అతడే ముందుండి కొన్ని మ్యాచులు గెలిపించాడు. నాయకత్వం పరంగా తిరుగులేదు. ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీనిస్తాడు. చరిత్రలో గొప్ప వికెట్కీపర్ బ్యాట్స్మన్గా నిలిచిపోతాడు. అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. ఆడేది టీమ్ఇండియా లేదా చెన్నై అయినా జట్టు అత్యుత్తమ ఆటతీరును బయటకి తీసుకొస్తాడు. అందుకే తన జట్టు ఆటగాళ్లందరూ ఎంఎస్డీని గౌరవిస్తారు’ అని వార్న్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు