Rohit Sharma: హిట్మ్యాన్ ఫిట్గా ఉంటే.. టెస్టు పగ్గాలు ఎందుకు అప్పగించకూడదు?: రవిశాస్త్రి
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్కి టెస్టు...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్కి టెస్టు ఫార్మాట్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. అయితే, గాయం కారణంగా అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం.. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.
‘రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. టెస్టు ఫార్మాట్కు కూడా అతడినే ఎందుకు పూర్తి స్థాయి కెప్టెన్గా నియమించకూడదు.? ఇప్పటికే వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని.. కెప్టెన్గా ఎందుకు ప్రమోట్ చేయకూడదు. రిషభ్ పంత్ కూడా అద్భుతమైన ఆటగాడు. ఒక కోచ్గా అతడి ఆట తీరు పట్ల గర్వపడుతున్నాను. ఆట పట్ల అతడి దృక్పథం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అతడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటాడని చెబుతుంటారు. అందులో వాస్తవం లేదు. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. జట్టు విజయం కోసం శాయశక్తులా కష్టపడతాడు. అందుకే కెప్టెన్సీ గురించి చర్చ జరిగినప్పుడు అతడిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
* రోహిత్కే తొలి ప్రాధాన్యం : షేన్ వార్న్
భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో తొలి ప్రాధాన్యం రోహిత్ శర్మకే ఇవ్వాలని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు. ‘టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలుకుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పట్ల నేనేమీ ఆశ్చర్యపోలేదు. భారత జట్టుకు సారథ్యం వహించడమనేది మామూలు విషయం కాదు. టీమ్ఇండియా కెప్టెన్పై ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిళ్లు ఉంటాయి. అయినా కోహ్లీ తన నాయకత్వ పటిమతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికీ అతడిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డున్న రోహిత్ శర్మకే.. టెస్టు కెప్టెన్సీ విషయంలో తొలి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. యువ ఆటగాడు కేఎల్ రాహుల్కి బాధ్యతలు అప్పగించినా ఫర్వాలేదు. అజింక్య రహానె ఇంకా మెరుగ్గా జట్టుని నడిపించగలడు. కానీ, ప్రస్తుతం అతడు ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఒకవేళ అతడు మునుపటి ఫామ్ను అందుకుంటే.. నిస్సందేహంగా అతడికి టెస్టు కెప్టెన్సీ అప్పగించవచ్చు’ అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి