Rohit Shrama: శార్దూల్ ఠాకూర్ కూడా అందుకు అర్హుడు: రోహిత్ శర్మ
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన శార్దూల్ ఠాకూర్ కూడా ఈ అవార్డుకు అర్హుడని రోహిత్ అన్నాడు. ఇంగ్లాండ్తో
(Photo:Bcci Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన శార్దూల్ ఠాకూర్ కూడా ఈ అవార్డుకు అర్హుడని రోహిత్ అన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో 2-1తో అధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(127) సెంచరీ చేయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధ శతకాలు బాది టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
‘సిరీస్లో 2-1తో అధిక్యం నిలవడం సంతోషంగా ఉంది. ఇది మేం ఇప్పటివరకు చేసిన కృషిని చూపుతుంది. ఇక్కడితో ముగియలేదు. మాంచెస్టర్లో మరో టెస్టు ఉంది. ఈ సిరీస్లో మేం ఇప్పటివరకు కొన్ని అద్భుతమైన ఘనతలు సాధించాం. మరింతగా రాణిస్తామనే నమ్మకం నాకుంది. అందు కోసం ఇదే పద్ధతిలో ముందుకు సాగాలి. శార్దూల్ ఠాకూర్ టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిజాయితీగా చెప్పాలంటే.. అతడు చేసిన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి అర్హుడు’ అని రోహిత్ శర్మ అన్నాడు.
‘మేం అతడి బ్యాటింగ్ని ఎలా మార్చిపోగలం. తొలి ఇన్నింగ్స్లో కేవలం 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అంతేకాదు కీలక సమయంలో జో రూట్ని ఔట్ చేశాడు. శార్దూల్కి బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టం. బాగా ఆడటం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అవును. నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కానీ, శార్దూల్ కూడా అందులో భాగమై ఉండాలని మానస్ఫూర్తిగా భావించా’ అని హిట్ మ్యాన్ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.