IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్‌ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్‌ టెస్ట్‌

న్యూజిలాండ్‌ తొలి టెస్టుని డ్రా దిశగా తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. దీంతో టీ బ్రేక్‌ సమయానికి 125/4తో నిలిచింది...

Published : 29 Nov 2021 14:32 IST

కాన్పూర్‌: న్యూజిలాండ్‌ తొలి టెస్టుని డ్రా దిశగా తీసుకెళ్తోంది. రెండో సెషన్‌లో కివీస్‌ జట్టు ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. దీంతో టీ బ్రేక్‌ సమయానికి 125/4తో నిలిచింది. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా ఆరు వికెట్లు కావాలి. 79/1తో రెండో  సెషన్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి బంతికే సోమర్‌ విలే (36) ఔటయ్యాడు. ఆపై లాథమ్‌ (52), విలియమ్సన్‌ (24*) నిలకడగా ఆడి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, లాథమ్‌ అర్ధశతకం తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 118/3. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్‌ టేలర్‌ (2) పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆడిన 23వ బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే, టీ బ్రేక్‌కు ముందు అతడు జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్‌ 125 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇక  చివరి సెషన్‌లో భారత్‌ విజయం సాధించాలంటే ఆరు వికెట్లు పడగొట్టాలి. అదే న్యూజిలాండ్‌ గెలుపొందాలంటే 159 పరుగులు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ మ్యాచ్‌ గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో ఆ జట్టు డ్రా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ రోజు ఆటలో 31.5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎన్ని ఓవర్ల బౌలింగ్‌కు వాతావరణం సహకరిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని