WTC Final: రిజర్వ్డేకు చేరిన తుదిపోరు..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 64/2తో నిలిచింది...
రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న టీమ్ఇండియా
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 249 ఆలౌట్..
ఇంటర్నెట్డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 64/2తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(30; 81 బంతుల్లో 2x4), శుభ్మన్గిల్(8; 33 బంతుల్లో) నిరాశపరిచారు. వీరిద్దర్నీ టిమ్సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఔట్ చేశాడు. దాంతో భారత్ 51 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే జోడీ కట్టిన చెతేశ్వర్ పుజారా(12; 55 బంతుల్లో 2x4), కెప్టెన్ విరాట్ కోహ్లీ(8; 12 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచారు. దాంతో టీమ్ఇండియా ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్ 101/2 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించగా తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమి 4/76, ఇషాంత్ శర్మ 3/48 కివీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు.
తొలుత కేన్ విలియమ్సన్(49; 177 బంతుల్లో 6x4), రాస్టేలర్(11; 37 బంతుల్లో 2x4) గంటసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేసినా తర్వాత ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 117 పరుగుల వద్ద షమి.. టేలర్ను మూడో వికెట్గా పెవిలియన్ పంపి ఐదో రోజు వికెట్ల వేట ప్రారంభించాడు. ఆ తర్వాత భోజన విరామానికి ముందు వరుస ఓవర్లలో ఇషాంత్, షమి.. హెన్రీ నికోల్స్(7), జేబీ వాట్లింగ్(1)ను ఔట్ చేశారు. దాంతో ఒక్కసారిగా టీమ్ఇండియా పోటీలోకి వచ్చింది. అప్పటికి కివీస్ స్కోర్ 135/5గా నమోదైంది. ఇక రెండో సెషన్లో మరింత విజృంభించిన భారత బౌలర్లు మిగిలిన ఐదు వికెట్లు తీశారు. విలియమ్సన్ కాస్త పోరాడినా మిగతా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే, చివర్లో టెయిలెండర్లు కైల్ జేమీసన్(21; 16 బంతుల్లో 1x6), టిమ్ సౌథీ(30; 46 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరును 249 పరుగులకు చేరవేశారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి