T20 World Cup: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం
దుబాయ్ వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడినా.. తర్వాత కుదురుకుని మోస్తరు పరుగులు చేసింది. తొలి నాలుగు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత పట్టు..
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడినా.. తర్వాత కుదురుకుని మోస్తరు పరుగులు చేసింది. తొలి నాలుగు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత పట్టు సడలించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) ఫేలవ ఫామ్ను కొనసాగించాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. వన్డౌన్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (0) కూడా తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. రెండో ఓవర్ చివరి బంతికి అతడు రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్(8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా వేసిన నాలుగో ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ (37) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ని నిలబెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో మాక్స్వెల్ బౌల్డయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (41)తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్ రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో మోస్తరు పరుగులు చేయగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు