చెన్నై టెస్టు: 300 దాటిన ఇంగ్లాండ్‌

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 స్కోర్‌ దాటింది. శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్‌(142), బెన్‌స్టోక్స్(26) నిలకడగా...

Updated : 06 Feb 2021 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 స్కోర్‌ దాటింది. శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్‌(142), బెన్‌స్టోక్స్(26) నిలకడగా‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 104 ఓవర్లకు 303/3 స్కోర్‌ సాధించారు. ఇక శుక్రవారం ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ రోరీబర్న్స్‌(33)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. లారెన్స్‌(0), డొమినిక్‌ సిబ్లీ(87; 286 బంతుల్లో 12x4)ని బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ పంపాడు.  

ఇవీ చదవండి..
ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 
ఎంతైనా మనం మనుషులం కదా: రవిశాస్త్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని