BCCI: ఆరు కాదు రెండు చోట్లే..వెస్టిండీస్తో సిరీస్ వేదికల్లో మార్పు
సొంతగడ్డపై వచ్చే నెలలో వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ).......
Updated : 22 Jan 2022 22:23 IST
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై వచ్చే నెలలో వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. పేటీఎం సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్ల్లో భారత్, విండీస్ తలపడనున్నాయి. అయితే, ఈ వేదికల్లో తాజాగా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ఆరు మ్యాచ్లను ఆరు వేదికల్లో నిర్వహించాలని తొలుత భావించిన బీసీసీఐ.. పలు కారణాలతో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆరు మ్యాచ్లను రెండు వేదికలకే పరిమితం చేసింది. ఫిబ్రవరి 6, 9, 11వ తేదీల్లో జరిగే మూడు వన్డే మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఆ తర్వాత 16, 18, 20వ తేదీల్లో జరిగే మూడు టీ20 మ్యాచ్లను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా